|
అగ్రస్థానంలో కోహ్లీ
ఫలితంగా టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి ఎగబాకాడు. అయితే, స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్లతో జరిగిన టెస్టు సిరీస్లో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేయడంతో తిరిగి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో పాక్తో జరిగిన సిరీస్లో స్మిత్ పేలవ ప్రదర్శన చేశాడు.
కోహ్లీని దాటే అవకాశం వచ్చినా
ప్రస్తుంత న్యూజిలాండ్ జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో స్మిత్కు మరోమారు విరాట్ కోహ్లీని దాటే అవకాశం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కివీస్తో ఇప్పటికే ముగిసిన రెండు టెస్టుల్లో 37.75 యావరేజితో 151 పరుగులు మాత్రమే చేశాడు. ఫలితంగా రెండో స్థానంలో నిలిచాడు.
అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో
ఇక, ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మార్నస్ లబుషేన్ అగ్రస్థానంలో నిలవగా స్మిత్ రెండో స్థానంలో నిలిచాడు. లబుషేన్ ఈ ఏడాది 11 మ్యాచ్లు ఆడి 1104 పరుగులు చేయగా, స్మిత్ 8 మ్యాచుల్లో 965 పరుగులు చేశాడు. అయితే, ఈ జాబితాలో కోహ్లీ 13వ స్థానంలో ఉన్నాడు.
8 మ్యాచ్లు ఆడి 612 పరుగులు చేసిన కోహ్లీ
ఈ ఏడాది మొత్తంగా 8 మ్యాచ్లు ఆడి 612 పరుగులు మాత్రమే చేశాడు. సోమవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో టాప్-10లో భారత్ నుంచి ముగ్గురు ఉన్నారు. పుజారా 791 పాయింట్లో ఐదో స్థానంలో నిలవగా, అజింక్య రహానే ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్ (డిసెంబర్ 30, 2019 నాటికి)
* విరాట్ కోహ్లీ
* స్టీవ్ స్మిత్
* కేన్ విలియంసన్
* మార్నస్ లాబుషేన్
* ఛటేశ్వర్ పూజారా
* బాబర్ అజామ్
* డేవిడ్ హెచ్చరిక
* అజింక్య రహానే
* జో రూట్
* క్వింటన్ డికాక్