న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Test rankings: స్మిత్‌కు చేరువలో, అగ్రస్థానానికి 3 పాయింట్ల దూరంలో కోహ్లీ

ICC Test Rankings : Virat Kohli Closes In On Top-Ranked Steve Smith || Oneindia Telugu
ICC Test rankings: Virat Kohli cuts down Steve Smiths lead after Pink ball Test hundred

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో ముగిసిన డే నైట్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి మరింతగా చేరువయ్యాడు. ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.

ఐసీసీ మంగళవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(928 రేటింగ్ పాయింట్లు)తో రెండో స్థానంలో నిలవగా... ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్(931) పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో కోహ్లీ 136 పరుగులతో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

మార్ష్‌ కప్‌ టోర్నీలో ఆసక్తికర ఘటన.. టాస్ వేస్తే 10 మీటర్ల దూరం పడిన కాయిన్‌(వీడియో)మార్ష్‌ కప్‌ టోర్నీలో ఆసక్తికర ఘటన.. టాస్ వేస్తే 10 మీటర్ల దూరం పడిన కాయిన్‌(వీడియో)

ఫలింతగా 25 పాయింట్ల వ్యత్యాసాన్ని కోహ్లీ తగ్గించాడు. తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన మయాంక్ అగర్వాల్(700 పాయింట్లు)తో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. టాప్-10లో నిలిచిన భారత నాలుగో బ్యాట్స్‌మెన్‌గా మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనత సాధించాడు.

ఛటేశ్వర్ పుజారా(791), అజ్యింకె రహానే(759) పాయింట్లతో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మూడు స్థానాలు ఎగబాకి తొలిసారి ఆల్ రౌండర్ల జాబితాలో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బెన్ స్టోక్స్(91,28) పరుగులతో ఫరవాలేదనిపించాడు.

నేను షేన్ వార్న్ స్నేహితుడిని కాబట్టే ఆసీస్ నన్ను స్లెడ్జ్ చేయలేదు: 'గప్‌చుప్' చాట్ షోలో కుంబ్లేనేను షేన్ వార్న్ స్నేహితుడిని కాబట్టే ఆసీస్ నన్ను స్లెడ్జ్ చేయలేదు: 'గప్‌చుప్' చాట్ షోలో కుంబ్లే

డే నైట్ టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లు తమ కెరీర్‌లో అత్యధిక పాయింట్లను సొంతం చేసుకున్నారు. ఇషాంత్ శర్మ(716) పాయింట్లతో 17వ స్థానంలో నిలవగా, ఉమేశ్ యాదవ్(672) పాయింట్లతో 21వ స్థానంలో నిలిచాడు. జులై 2011లో ఇషాంత్ శర్మ తొలిసారి ఏడో స్థానంలో నిలిచి కెరీర్ అత్యుత్తమ ర్యాంకుని అందుకున్నాడు.

Story first published: Tuesday, November 26, 2019, 16:13 [IST]
Other articles published on Nov 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X