దుబాయ్: 2015 సంవత్సరానికి గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టెస్టు, వన్డే జట్లను ప్రకటించింది. ఈ జట్లలో ఇద్దరు భారత క్రికెటర్లకు మాత్రమే చోటు దక్కింది. ప్రతి ఏడు మాదిరిగానే ఈ ఏడు కూడా ఐసిసి జట్లను ప్రకటించింది. ఈ మేరకు బుధవారంనాడు ఓ ప్రకటన చేసింది.
టెస్టు జట్టుకు ఇంగ్లాండుకు చెందిన అలిస్టర్ కుక్ కెప్టెన్గా, వన్డే జట్టుకు దక్షిణాఫ్రికాకు చెందిన ఎబి డీవిల్లీర్స్ కెప్టెన్గా ఎంపికయ్యారు. వన్డే జట్టులోని 11 మంది ఆటగాళ్లలో భారత్కు చెందిన ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ చోటు దక్కించుకున్నాడు. వన్డే జట్టులో 12వ ఆటగాడిగా అశ్విన్కు చోటు దక్కింది.
గత ఎనిమిదేళ్ల కాలంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వన్డే జట్టులో స్థానం దక్కించుకోలేపోయాడు. 2014 నుంచి ఐదేళ్ల పాటు వరుసగా ఐసిసి వన్డే జట్టు కెప్టెన్గా ధోనీ ఎంపికయ్యాడు. ఏడేళ్ల పాటు వన్డే జట్టులో అతను ఉన్నాడు. ఈ ఏడాది అతనికి స్థానం దక్కలేదు.

2015 సంవత్సరానికి ఐసిసి టెస్టు జట్టు (బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం
డేవిడే వార్నర్ (ఆస్ట్రేలియా)
ఆలిస్టిర్ కుక్ (ఇంగ్లాండు)
కానే విలియమ్సన్ (న్యూజిలాండ్)
యూనిస్ ఖాన్ (పాకిస్తాన్)
స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా)
జ్యో రూట్ (ఇంగ్లాండు)
సర్ఫరాజ్ అహ్మద్ (పాకిస్తాన్) (వికెట్ కీపర్)
స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండు)
ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్)
యాసిర్ షా (పాకిస్తాన్)
జోష్ హాజిల్వుడ్ (ఆస్ట్రేలియా)
పన్నెండవ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (భారత్)
2015 సంవత్సరానికి గాను ఐసిసి వన్డే జట్టు
తిలక్రత్నే దిల్షాన్ (శ్రీలంక)
హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా)
కుమార్ సంగక్కర్ (శ్రీలంక) (వికెట్ కీపర్)
ఎబి డీవిల్లీర్స్ (దక్షిణాఫ్రికా)
స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా)
రాస్ టైలర్ (న్యూజిలాండ్)
ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్)
మొహమ్మద్ షమీ (భారత్)
మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)
ముస్తఫిజుర్ రహ్మాన్ (బంగ్లాదేశ్)
ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా)
12వ ఆటగాడు జ్యో రూట్ (ఇంగ్లాండు)