దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య వన్డే ట్రై-సిరీస్ కోసం భద్రతా ప్రణాళికలను పర్యవేక్షించడానికి న్యూజిలాండ్ క్రికెట్ (NZC) ఇటీవల పాకిస్తాన్కు ప్రతినిధి బృందాన్ని పంపింది. బ్రాడ్ రోడెన్, న్యూజిలాండ్ ప్లేయర్స్ అసోసియేషన్ ప్రతినిధి, సెక్యూరిటీ స్పెషలిస్ట్ రెగ్ డికాసన్ ప్రతినిధి బృందంలో ఉన్నారు. బృందం కరాచీ, లాహోర్లను సందర్శించింది. భద్రతా ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు పాకిస్తాన్ దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లకు ఆతిథ్యం ఇస్తుంది.
అటు ICC ప్రతినిధులు కూడా పాకిస్తాన్కు చేరుకున్నారు. రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రణాళికలు, సన్నాహాలను పరిశీలించడానికి వెళ్లారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. ఈ టోర్నమెంట్ ను హైబ్రిడ్ మోడల్ నిర్వహించనున్నారు. హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ జరుగుతుందని ఐసీసీ తెలిపిన విషయం తెలిసిందే. భారత్ మ్యాచ్లు తటస్థ వేదికగా జరుగుతాయని పేర్కొంది. అలాగే 2027 వరకు భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ కూడా తటస్థ వేదికగా మ్యాచ్లు ఆడుతుందని స్పష్టం చేసింది.

2025లో మహిళల ODI ప్రపంచకప్, 2026లో T20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్లలో తమ మ్యాచ్ల కోసం పాకిస్థాన్ కూడా భారత్కు వెళ్లడం లేదని ఐసీసీ ధృవీకరించింది. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ ఇంకా ప్రకటించబడలేదు కానీ త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ పై పలు వెబ్ సైట్లు కథనాలు రాస్తున్నాయి. ఫిబ్రవరి 19న పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుందని ఓ వెబ్ సైట్ పేర్కొంది.
మార్చి 4న సెమీఫైనల్-1, మార్చి 5న సెమీఫైనల్-2 జరుగుతాయని పేర్కొంది. అయితే ఇది అధికారిక సమాచారం కాదు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్లు పాల్గొననున్నాయి.