For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2022కు మారిన ఐసీసీ టీ-20 ప్రపంచ కప్..? ఐపీఎల్ ఎప్పుడో తెలుసా..?

ICC T20 World cup pushed to 2022, IPL may happen in October if Covid-19 under control
IPL 2020 In October, ICC T20 World Cup Postponed To 2022

ఈ ఏడాది జరగాల్సిన టీట్వంటీ ప్రపంచకప్‌ 2022వ సంవత్సరానికి షెడ్యూల్ చేయనున్నారా..? ఐపీఎల్ నిర్వహణ అక్టోబర్-నవంబర్‌కు మార్చనున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కరోనావైరస్ విజృంభణతో క్రికెట్ గేమ్ అభిమానులకు దూరమైంది. నెమ్మదిగా పరిస్థితులు మార్పు కనిపిస్తుండటంతో మళ్లీ ఈ జెంటిల్‌మ్యాన్ గేమ్‌ పట్టాలెక్కనుంది. ఇప్పటికే కరోనావైరస్‌తో అటు మ్యాచ్‌లు రద్దు కావడం మరోవైపు భారీగా రెవిన్యూ కోల్పోవడం జరిగింది. అయితే ఇక అన్ని చర్చలు జరిపిన ఐసీసీ ఎట్టకేలకు ఒక స్పష్టమైన నిర్ణయంతో బయటకు వచ్చింది.

2022లో టీట్వంటీ ప్రపంచ కప్

2022లో టీట్వంటీ ప్రపంచ కప్

ఈ ఏడాది అక్టోబర్‌లో జరగాల్సిన టీట్వంటీ ప్రపంచకప్‌ను వచ్చే ఏడాదికి కాకుండా ఏకంగా 2022కు షెడ్యూల్ చేస్తూ ఐసీసీ నిర్ణయించింది. టీట్వంటీ వరల్డ్ కప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరుగుతుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా 2022కు ఈ మెగా టోర్నీని షెడ్యూల్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే రెండు మెగా టోర్నీలను 6నెలల సమయంలో నిర్వహించేందుకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితి కూడా అనుకూలంగా లేదని ఐసీసీ చెబుతోంది. అంటే ఈ మ్యాచ్‌లను టెలికాస్ట్ చేసేందుకు స్టార్ స్పోర్ట్స్‌ ముందుకొస్తున్నప్పటికీ అడ్వర్టైజ్ పరంగా మార్కెట్లు సహకరించే పరిస్థితి లేదని సమాచారం.

 రెండు మెగా ఈవెంట్లను నిర్వహించాలంటే...

రెండు మెగా ఈవెంట్లను నిర్వహించాలంటే...

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు మెగా ఈవెంట్లను నిర్వహించేందుకు మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేవని చెబుతున్న ఐసీసీ తప్పని పరిస్థితుల్లో టీట్వంటీ ప్రపంచకప్‌ను 2022కు షెడ్యూల్ చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. ముందుగా టోర్నమెంటును వాయిదా వేస్తున్నామే తప్ప రద్దు చేయడం లేదనేది గ్రహించాలని ఐసీసీ విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో 2022లో ప్రపంచ స్థాయి మ్యాచ్‌లు ఏవీ లేకపోవడంతో టీట్వంటీ ప్రపంచ కప్ అప్పుడు నిర్వహించడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది.

2022లో ఆస్ట్రేలియాలో టీ ట్వంటీ ప్రపంచకప్

2022లో ఆస్ట్రేలియాలో టీ ట్వంటీ ప్రపంచకప్

ఇక కొత్త షెడ్యూల్ ప్రకారం 2021లో భారత్ ఒక టీట్వంటీ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుండగా ఈ ఏడాది జరగాల్సిన టీట్వంటీ ప్రపంచ‌కప్‌ను ఆస్ట్రేలియా 2022లో ఆతిథ్యం ఇస్తుందని ఐసీసీ తెలిపింది. ఆ తర్వాత 2023లో భారత్ ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తుందని స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు మాటలు మాత్రమే జరిగాయని చెప్పిన ఐసీసీ మే 28న జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ కొత్త షెడ్యూల్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ షెడ్యూల్‌కు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణకు లైన్ క్లియర్ అవుతుందని ఐసీసీ చెబుతోంది.

ఐపీఎల్‌పై బీసీసీఐ ఏం చెబుతోంది..?

ఐపీఎల్‌పై బీసీసీఐ ఏం చెబుతోంది..?

కరోనావైరస్ నియంత్రణలో ఉంటే అక్టోబర్ నెలలో ఐపీఎల్ వాస్తవరూపం దాలుస్తుందని బీసీసీఐ చెబుతోంది. జూలైలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. అయితే ఇది పూర్తిగా వైరస్‌ను బట్టే ఉంటుందని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఈ మెగా ఈవెంట్‌కు ప్లేయర్లు, సిబ్బంది, ప్రేక్షకుల కదలికలు వీటన్నిటిపై దృష్టి సారించాల్సి ఉంటుందని బీసీసీఐ వెల్లడించింది.

Story first published: Wednesday, May 27, 2020, 12:50 [IST]
Other articles published on May 27, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+