రోహిత్ 3 స్థానాలు పైకి చేరి 7వ ర్యాంక్
సోమవారం ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్లు సత్తాచాటారు. ఈ సిరీస్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబర్చి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచిన కుల్దీప్ ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్ని అందుకున్నాడు. ఇక కెరీర్లో 4వ టీ20 సెంచరీ బాదిన రోహిత్ శర్మ 3 స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో ర్యాంక్ను చేజిక్కించుకున్నాడు.
ధావన్ 5 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్ని
ఆదివారం రాత్రి ముగిసిన మూడో టీ20లో 92 పరుగులు చేసిన శిఖర్ ధావన్ 5 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్ని అందుకున్నాడు. టీ20 సిరీస్లో విఫలమైనా.. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ టాప్-5లో చోటు నిలబెట్టుకోగా.. రోహిత్కి పగ్గాలప్పగించి రెస్ట్ తీసుకున్న రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి 15వ స్థానానికి పడిపోయాడు.
టాప్-5లో చోటు నిలబెట్టుకున్నచాహల్
తొలి రెండు టీ20ల్లోనూ రిజర్వ్ బెంచ్కే పరిమితమై.. ఆఖరి టీ20లో అవకాశం దక్కించుకున్న మణికట్టు స్పిన్నర్ చాహల్ రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా.. టాప్-5లో చోటు నిలబెట్టుకున్నాడు. స్థాన మార్పుల్లో పెద్దగా ప్రభావం భువనేశ్వర్, బుమ్రాలపై పడలేదు. వరుసగా 20, 21వ స్థానాల్లో నిలిచారు.
126 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో:
టీ20 జట్టు ర్యాంకింగ్స్లో 138 పాయింట్లతో పాకిస్థాన్ అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. భారత్ జట్టు 126 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. కానీ, భారత్ చేతిలో క్లీన్ స్వీప్కు గురైన వెస్టిండీస్ ఏకంగా 7 స్థానానికి పడిపోయింది.