హైదరాబాద్: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలతో క్రికెట్ సంబంధాలు నిలిపివేయాలని బీసీసీఐ చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తోసిపుచ్చింది. ఉగ్రవాద సంబంధ అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదని ఐసీసీ స్పష్టం చేసింది.
గత నెలలో జరిగిన పుల్వా మా ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడికి కారణమైన వారిని క్రికెట్ నుంచి బహిష్కరించాలని, వారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దంటూ బీసీసీఐ రాసిన లేఖకు ఐసీసీ తాజాగా స్పందించింది.
క్రీజులో ధోని ఉంటే చాలు... ఆ ఆత్మవిశ్వాసమే వేరు: కేదార్ జాదవ్
"జరిగిన ఉదంతాన్ని కారణంగా చూపుతూ సభ్య దేశంపై బహిష్కరణ వేటు వేయలేం. ఓ దేశాన్ని వెలివేయడమనేది ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని, అందులో ఐసీసీ పాత్రేమీ ఉండదని ఛైర్మన్ శశాంక్ మనోహర్ స్పష్టం చేశారు. ఈ విషయం బీసీసీఐకి కూడా తెలుసు" అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు.
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరల్డ్కప్లో భారత్-పాక్ మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. మే30 నుంచి వరల్డ్కప్ ఆరంభం కానుండగా.. షెడ్యూల్ ప్రకారం జూన్ 16న మాంచెస్టర్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. పాక్తో మ్యాచ్పై బీసీసీఐ పాలకుల కమిటీ రద్దు అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నడుచుకుంటామని సీఓఏ సైతం పేర్కొంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో మ్యాచ్ను భారత్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు.