
సరైన ప్రక్రియనే అవలంబించారు
"వారు సరైన ప్రక్రియనే అవలంబించారు. రివ్యూ కోసం థర్డ్ అంపైర్ను సంప్రదించేందుకు అప్పటి పరిస్థితుల్లో వారికి అవకాశం లేదు. అలాంటి తీర్పును మైదానంలో ఉన్న వారే ఇవ్వాలి. మ్యాచ్ రిఫరీ జోక్యం చేసుకోలేరు" అని జియోఫ్ తెలిపారు. కాగా, ఓవర్ త్రో విషయంలో తాను తీసుకున్న నిర్ణయం తప్పేనని మ్యాచ్ అనంతరం ధర్మసేన వ్యాఖ్యానించడం గమనార్హం.

అసలేం జరిగింది?
ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి మూడు బంతుల్లో తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మార్టిన్ గప్టిల్ విసిరిన త్రో అనూహ్యంగా బెన్స్టోక్స్ బ్యాట్కు తగిలి బౌండరీ వెళ్లింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ తీసిన రెండు పరుగులతోపాటు ఓవర్ త్రో వల్ల అదనంగా మరో నాలుగు పరుగులు ఆ జట్టుకు కలిసివచ్చాయి.

ఓవర్ త్రో కారణంగా మ్యాచ్ ఫలితం తారుమారు
ఈ ఓవర్ త్రో కారణంగా మ్యాచ్ ఫలితమే తారుమారైంది. ఈ పరుగుల కారణంగా తొలుత ఇరు జట్లు ప్రధాన స్కోరు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ ఫలితం నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ను నిర్వహించారు. సూపర్ ఓవర్లోనూ ఇరు జట్ల స్కోరు సమం అయిన నేపథ్యంలో బౌండరీ సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్ను ఐసీసీ విజేతగా ప్రకటించింది.


Click it and Unblock the Notifications












