కుటుంబ సభ్యులకు తొలుత అనుమతి నిరాకరణ
ఈ ప్రపంచకప్లో కూడా క్రికెటర్ల కుటుంబ సభ్యులకు తొలుత అనుమతి నిరాకరించిన పాక్ బోర్డు, ఆ తర్వాత ఆ నిబంధనను సడలించింది. దీంతో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం క్రికెటర్ల కుటుంబ సభ్యులు ఇంగ్లాండ్ చేరుకునేందుకు అంగీకరించింది. భార్యాపిల్లలు ఆటగాళ్లతో కలిసి ఉండడంవల్ల ఏకాగ్రత దెబ్బతింటుందని అన్నాడు.
క్రికెటర్లు నిరంతరం క్రికెట్ గురించే
ప్రపంచకప్ మెగా టోర్నీలో క్రికెటర్లు నిరంతరం క్రికెట్ గురించే ఆలోచించాల్సివుంటుందని, అందులోనూ భారత్తో ఎంతో ముఖ్యమైన మ్యాచ్ ఆడే సమయంలో కుటుంబ సభ్యులు ఆటగాళ్లతో ఉండడం ఏమాత్రం సమర్థనీయం కాదని యూసుఫ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
పాక్ బోర్డు విదేశాల్లో జరిగే వన్డే టోర్నీలకు
పాక్ తరుపున మహ్మద్ యూసుఫ్ 90 టెస్టులు, 288 వన్డే మ్యాచ్లాడాడు. గతంలో పాక్ బోర్డు విదేశాల్లో జరిగే వన్డే టోర్నీలకు కూడా తమ కుటుంబ సభ్యలను అనుమతించేది కాదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. కాగా, 1992 నుండి 2015 ప్రపంచకప్ వరకు భారత్, పాక్లు ఆరుసార్లు తలపడగా.. ఆరుసార్లు భారతే విజేతగా నిలిచింది.
టీమిండియా వరుసగా రెండు విజయాలు
టోర్నీలో టీమిండియా రెండు వరుస విజయాలు సాధించగా గురువారం న్యూజిలాండ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఏడు పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా... ఐదు పాయింట్లతో భారత్ నాలుగోస్థానంలో కొనసాగుతోంది. పాక్ నాలుగు మ్యాచ్లకు గాను రెండింట ఓడి, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.