న్యూజిలాండ్దే బెర్త్:
ప్రస్తుతం 9 పాయింట్లతో ఉన్న పాకిస్థాన్.. ఆఖరి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో నెగ్గితే పాక్ కూడా కివీస్తో సమంగా 11 పాయింట్లు సాధిస్తుంది. అయితే మెరుగైన రన్రేట్ను పరిగణనలోకి తీసుకుంటే.. న్యూజిలాండ్ ముందడుగు వేస్తుంది. కివీస్ను పాక్ వెనక్కునెట్టాలనుకుంటే.. తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేయడంతో పాటు బంగ్లాదేశ్ను కనీసం 316 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది. ఇది అసాధ్యం కాబట్టి న్యూజిలాండ్దే బెర్త్.
సమీకరణాలు మారే అవకాశం:
సెమీఫైనల్లో.. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలోని జట్టుతో తలపడుతుంది. ఇక రెండో స్థానంలో నిలిచిన జట్టు మూడో స్థానంలో నిలిచిన జట్టుతో పోటీ పడుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 14 పాంట్లతో అగ్రస్థానంలో నిలువగా.. భారత్ 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ 12 పాయింట్లతో మూడో స్థానంలో, న్యూజిలాండ్ 11 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే.. ఇండియా సెమీ ఫైనల్ ప్రత్యర్థి ఇంగ్లండ్ కానుంది. అయితే దక్షిణాఫ్రికాతో ఆసీస్, శ్రీలంకతో టీమిండియా ఆడాల్సి ఉన్నందున ఈ సమీకరణాలు మారే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా ఓడి.. భారత్ గెలిస్తే:
దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడిపోయి.. శ్రీలంకపై భారత్ గెలిస్తే కోహ్లీ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానంకు చేరుకుంటుంది. అప్పుడు భారత్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ను ఢీ కొడుతుంది. ఇక దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచులో ఆస్ట్రేలియా.. శ్రీలంకపై భారత్ విజయం సాధిస్తే ఇండియా రెండో స్థానానికే పరిమితమవుతుంది. అప్పుడు ఇంగ్లండ్తో భారత్ సెమీ ఫైనల్ ఆడుతుంది.
ఆస్ట్రేలియా గెలిచి.. భారత్ ఓడిపోతే:
దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచులో ఆస్ట్రేలియా గెలిచి.. శ్రీలంకపై భారత్ ఓడిపోతే అప్పుడు భారత్ సెమీఫైనల్లో ఇంగ్లండ్తో ఆడుతుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయి.. శ్రీలంకపై భారత్ విజయం సాధిస్తే మెరుగైన రన్రేట్తో భారత్ అగ్రస్థానాన్ని చేరుకుంటుంది. అపుడు న్యూజిలాండ్తో ఆడుతుంది. ఎటు చూసినా భారత్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ లేదా న్యూజిలాండ్తో తలపడనుంది.