లతా మంగేష్కర్ సాయంతో రివార్డు:
దీంతో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్కేపీ సాల్వే.. సింగర్ లతా మంగేష్కర్ సాయం కోరారు. ఆమెతో ఢిల్లీలో ఓ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించగా.. టిక్కెట్ల ద్వారా రూ. రెండు లక్షలు వచ్చాయి. ఆ డబ్బును విశ్వవిజేత టీమిండియాకు బీసీసీఐ రివార్డుగా ఇచ్చి సత్కరించింది.
జాతీయ సెలవు దినం:
భారత్ 1983లో విశ్వవిజేతగా నిలవడంతో.. ఆటగాళ్ల కృషికి గుర్తుగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఫైనల్ తర్వాతి రోజు (జూన్ 26న)న జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. 1983 ప్రపంచకప్పై పెద్దగా ఆశలు పెట్టుకొని భారత ఆటగాళ్లు అమెరికా పర్యటనకు ప్లాన్ వేసుకున్నారు. ఇక గ్రూపు దశలో వెనుదిరిగితే అక్కడ కొన్ని ఫ్రెండ్లీ మ్యాచ్లు ఆడాలని కూడా ప్లాన్ వేసుకున్నారట. అనూహ్యంగా ఫైనల్ చేరడంతో వారి ప్లానులు అన్ని తలక్రిందులయ్యాయి.
భారత్ జయకేతనం:
లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి విండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. విండీస్ బౌలర్ల ధాటికి భారత ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ చేరి కేవలం 183 పరుగులు మాత్రమే చేశారు. శ్రీకాంత్ (38), అమర్నాథ్ (26)లు పర్వాలేదనిపించారు. లక్ష్య ఛేదనలో విండీస్ కూడా త్వరగానే వికెట్లు కోల్పోయింది. వివిఎన్ రిచర్డ్స్ (33) పోరాడాడు. అయితే కపిల్దేవ్, మదన్లాల్, అమర్నాథ్లు చెలరేగడంతో విండీస్ 140 పరుగులకే ఆలౌట్ అయింది.