
భారత్తో మ్యాచ్కు ముందు వెస్టిండీస్కు జట్టుకు భారీ షాక్ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ ప్రపంచకప్ నుంచి వైదొలిగాడు. రసెల్ టోర్నీ నుంచి తప్పుకున్న విషయాన్ని విండీస్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. కీలక సెమీస్ మ్యాచ్లకు ముందు రసెల్ టోర్నీ నుండి తప్పుకోవడంతో విండీస్ ఆందోళనలో ఉంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రపంచకప్ ఆరంభమైన నాటి నుంచి మోకాలి గాయంతో బాధపడుతున్న రసెల్ మ్యాచ్లకు దూరమవుతున్నాడు. ఈ టోర్నీలో కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడిన రసెల్.. 36 పరుగులు చేసి ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. అతడి స్థానంలో సునీల్ ఆంబ్రోస్ జట్టులోకి వస్తాడని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్లో అదరగొట్టిన రస్సెల్.. ప్రపంచకప్లో మాత్రం తేలిపోయాడు. ఒక్క మ్యాచ్లో కూడా తనదైన ముద్ర వేయలేదు. కీలక మ్యాచ్లలో కూడా రసెల్ చేతులెత్తేశాడు.
ఈ మెగా టోర్నీలో విండీస్ ఇప్పటివరకూ ఆరు మ్యాచ్లు ఆడగా.. ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్ రద్దయ్యింది. ప్రస్తుతం విండీస్ ఖాతాలో మూడు పాయింట్లు ఉన్నాయి. వెస్టిండీస్కు ఇంకా మూడు మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. ఆ జట్టు సెమీస్ అవకాశాలపై ఆశలు పెట్టుకోవాలంటే అన్నీ గెలవాలి. ఈ తరుణంలో రసెల్ జట్టుకు దూరం కావడం విండీస్కు ఎదురుదెబ్బే.