|
టీమిండియాకు విందు
అయితే, కీలకమైన ఆస్ట్రేలియాతో మ్యాచ్కు ముందు టీమిండియా ప్రాక్టీస్కు వరుణుడు అడ్డం పడ్డాడు. వర్షం కారణంగా శుక్రవారం ప్రాక్టీస్ సాగలేదు. మరోవైపు టీమిండియాను బ్రిటన్లో భారత హైకమిషనర్ రుచి ఘనశ్యామ్ శుక్రవారం విందుకు ఆహ్వానించారు. ఈ విందుకు కెప్టెన్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రితో సహా జట్టు సభ్యులందరూ హాజరయ్యారు.
|
బీసీసీఐ ట్విట్టర్లో పోటోలు
ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఈ మెగా టోర్నీని కోహ్లీసేన విజయంతో ఆరంభించింది. టోర్నీలో భాగంగా సపారీలతో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు.
8 మ్యాచ్ల్లో నెగ్గిన ఆసీస్
ఇదిలా ఉంటే, శుక్రవారం వర్షం కారణంగా టీమిండియా ప్రాక్టీస్ రద్దు కావడంతో... ఆస్ట్రేలియాతో మ్యాచ్ సన్నాహానికి టీమిండియా శనివారం ఒక్క రోజే అందుబాటులో ఉంది. ఇదిలా ఉంటే, వరల్డ్కప్లో ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య మొత్తం 11 మ్యాచ్లు జరగ్గా 8 మ్యాచ్ల్లో ఆసీస్ నెగ్గగా... భారత్ మూడింట విజయం సాధించింది.