హైదరాబాద్: గాయం కారణంగా ప్రపంచకప్లోని మిగతా మ్యాచ్లకు ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమైన సంగతి తెలిసిందే. ధావన్ స్థానంలో సెలక్టర్లు పంత్ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు ఇది సరైన అవకాశమని చెప్పుకొచ్చాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
"నిన్ను నువ్వు నిరూపించుకునేందుకు ఇంతకన్నా పెద్ద అవకాశం మరొకటి ఉండదు" అని సచిన్ తెలిపాడు. గత అక్టోబర్లో వెస్టిండీస్పై అరంగేట్రం చేసిన రిషబ్ పంత్ ఇప్పటి వరకు ఆడిన ఐదు వన్డేల్లో 23.25 యావరేజితో సాధించాడు. భారత పర్యటనకు వచ్చిన ఆసీస్ జట్టులో చిన్నపాటి తప్పదం కారణంగా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
రిషబ్ పంత్కు తప్పక చోటు దక్కించుకుందని భావించినప్పటికీ... ఆఖరి నిమిషంలో అతడి స్థానంలో సీనియర్ వికెట్ కీపర్ దినేశ్కార్తిక్వైపు సెలెక్టర్లు మొగ్గు చూపారు. ప్రపంచకప్లో భాగంగా టీమిండియా శనివారం ఆప్ఘనిస్థాన్తో తలపడనుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్లు నెగ్గి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
Feel for you Shikhar. You were playing well & to be injured in the middle of such an important tournament is heartbreaking. I’m sure you’ll come back stronger than ever.
— Sachin Tendulkar (@sachin_rt) June 20, 2019
Rishabh you’ve been playing well & there can’t be a bigger platform to express yourself. Good luck! pic.twitter.com/T7qzKcDfoO