విశ్రాంతి కావాలని:
భారత్ బుధవారం దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. భారత్కు ఇది తొలి మ్యాచ్ కాగా.. దక్షిణాఫ్రికాకు మూడో మ్యాచ్ కావడం గమనార్హం. అయితే ప్రపంచకప్లో భారత్ తొలి మ్యాచ్ ఆలస్యంకు అసలు కారణం బీసీసీఐనే అట. ఐపీఎల్ 2019 సీజన్తో దాదాపు నెలన్నర పాటు టీమిండియా క్రికెటర్లు విశ్రాంతి లేకుండా ఆడారు. అంతకుముందు ఆస్ట్రేలియా సిరీస్ కూడా ఆడారు. తీరిక లేని క్రికెట్ ఆడిన నేపథ్యంలో ఆటగాళ్లకు విశ్రాంతి కావాలని బీసీసీఐ భావించింది.
|
ఐసీసీని కోరిన బీసీసీఐ:
ఆటగాళ్లకు విశ్రాంతి కావాలని బీసీసీఐ స్వయంగా ఐసీసీని కోరింది. దీంతో టోర్నీ మొదలైన వారం తర్వాత టీమిండియా తొలి మ్యాచ్ ఆడేలా ఐసీసీ షెడ్యూల్ను రూపొందించింది. ఈ సమయంను టీంఇండియా ఆటగాళ్లు బాగానే ఉపయోగించుకున్నారు. ఈ సమయంలో గాయపడిన ఆటగాళ్లు కూడా ఫిట్నెస్ సాధించగా.. మరికొందరేమో నెట్స్ లో సాధన చేశారు. ఏదేమైనా ఈ ఆలస్యం మనకు మేలు చేసింది.
|
ఇంకెప్పుడ్రా మన మ్యాచ్:
తొలి మ్యాచ్ ఆలస్యంపై అభిమానులు సోషల్ మీడియాలో జోకులు పేల్చుతున్నారు. ఫన్నీ మీమ్స్ పోస్ట్ చేసి కామెంట్లు కురిపిస్తున్నారు. 'అబ్బా.. టీంఇండియా మ్యాచ్ ఇంకెప్పుడు' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'ఇంకెప్పుడ్రా మన మ్యాచ్' అని మరో అభిమాని ట్వీటాడు. 'కోడి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలైనా భారత్ మ్యాచ్ ఆడేటట్టు లేదు', 'ఆటగాళ్లంతా డగౌట్లో కూర్చుని అస్థిపంజరాలైనా ఐసీసీ మ్యాచ్ ఆడించేటట్టు' లేదని కామెంట్ చేస్తున్నారు.