భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాకు చెందిన ఓ బ్యాట్ల కంపెనీపై నష్ట పరిహారం (దావా) కేసును నమోదు చేశారు. ఒప్పందం ప్రకారం సచిన్కు ఇవ్వాల్సిన డబ్బును ఆ కంపెనీ ఇవ్వకపోవడంతో.. రెండు మిలియన్ల డాలర్ల (14కోట్లు ) నష్ట పరిహారం కేసును నమోదు చేశారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన స్పార్టన్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ సంస్థ (బ్యాట్ల తయారీ కంపెనీ) తన ఉత్పత్తుల ప్రమోషన్ కోసం సచిన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా సచిన్కు ఏడాదికి మిలియన్ డాలర్లు ఇవ్వాలి. స్పార్టన్ కంపెనీ తన బ్యాట్లపై సచిన్ లోగో, ఇమేజ్ను ముద్రించింది. సచిన్ బై స్పార్టన్ అన్న ట్యాగ్లైన్తో ఆ కంపెనీ తన ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించింది.
అయితే ఒప్పందం ప్రకారం సచిన్కు ఇవ్వాల్సిన డబ్బును ఆ కంపెనీ ఇవ్వలేదు. 2016లో ఒప్పందం కుదుర్చుకున్న సదరు కంపెనీ 20018 వరకు డబ్బు చెల్లించలేదు. దీంతో స్పార్టన్ కంపెనీపై సచిన్ రెండు మిలియన్ల డాలర్ల నష్ట పరిహారం కేసును నమోదు చేశారు. ఈ ఏడాది జూన్ 5వ తేదీన కేసును నమోదు చేశారు. స్పార్టన్ కంపెనీకి చెందిన బ్యాటును మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.