హైదరాబాద్: అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న హై ఓల్టేజ్ మ్యాచ్కి సర్వం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా ఈ ఆదివారం మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్లో భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం అటు భారత, పాక్ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే, భారత్-పాక్ మ్యాచ్లో వర్షం విజయం సాధించేలా ఉందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే 4 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఈ ఆదివారం భారత్-పాక్ మ్యాచ్కి ఆతిథ్యమిస్తోన్న మాంచెస్టర్లో భారీ వర్ష సూచన ఉంది.
ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కూడా వర్షార్పణం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్తర్ తన ట్విటర్లో ఓ ఫన్నీ మీమ్ను అభిమానులతో పంచుకున్నాడు. టాస్ కోసం ఇరు జట్ల కెప్టెన్లు మైదానంలోకి వెళ్లగానే వర్షం ప్రారంభమైందని... దీంతో కోహ్లీ, సర్ఫరాజ్లు స్విమ్ చేకుంటూ బయటకు వస్తున్నారని ఓ ట్వీట్ను పోస్టు చేశాడు.
ఇక, క్రికెట్ ఎక్స్పెర్ట్స్ బోట్పై నిలబడి మరి విశ్లేషిస్తున్నారని తెలిపేలా ఆ మీమ్ ఉంది. నీటితో నిండిన స్టేడియంలో ఓ షార్క్ కూడా ఉంది. ఆదివారం ఇలాంటి పరిస్థితే ఉంటుందని అక్తర్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ను టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం రీట్వీట్ చేశాడు.
Sunday looking a bit like this. Haha#PAKvIND #CWC19 pic.twitter.com/rTO70ru6UY
— Shoaib Akhtar (@shoaib100mph) June 14, 2019