కొంతమంది నోర్లనైనా మూయించామనుకుంటున్నా:
అయితే ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 49 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంపై పాకిస్థాన్ కోచ్ మిక్కీ ఆర్థర్ స్పందించాడు. 'నాకు ఏదైతే తెలుసో అదే మా ఆటగాళ్లు చేస్తారు. పాక్ ఆటగాళ్లు తిరిగి గాడిలో పడడంతో మ్యాచ్ గెలిచాం. టీమిండియాతో ఓటమి కారుణంగా అనేక విమర్శలు వచ్చాయి. మీడియా, సోషల్ మీడియాతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఈ విజయంతో వారిలో కొంతమంది నోర్లనైనా మూయించామనుకుంటున్నా' అని ఆర్థర్ అన్నారు.
సెమీస్ చేరుతాం:
'న్యూజిలాండ్తో మ్యాచ్ కూడా గెలుస్తాం. సెమీస్ చేరేందుకు మిగతా మ్యాచ్లని సైతం గెలుస్తాం. న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లను ఓడించి సెమీస్ చేరుతాం. పాక్ జట్టు బలంగా ఉంది. పాకిస్థాన్ బ్యాటింగ్, బౌలింగ్ బాగానే ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో క్యాచ్లు జారవిడవడంపై దృష్టిసారిస్తాం. తదుపరి మ్యాచ్ల్లో పొరపాట్లు చేయకుండా చూసుకుంటాం' అని ఆర్థర్ తెలిపారు.
సోహైల్ బ్యాటింగ్ అద్భుతం:
'మధ్య ఓవర్లలో హారిస్ సోహైల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతని బ్యాటింగ్ అద్భుతం. సరైన సమయంలో పరుగులు చేసాడు. మిగతా బ్యాట్స్మన్లతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఇపుడు అతను మా ప్రధాన బ్యాట్స్మన్. వచ్చే మ్యాచులలో కూడా సోహైల్ రాణించాలని కోరుకుంటున్నా' అని ఆర్థర్ అభిప్రాయపడ్డాడు.