హైదరాబాద్: కార్డిఫ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంకకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక మొదటి ఓవర్ రెండో బంతికే వికెట్ కోల్పోయింది. కివీస్ పేసర్ హెన్రీ బౌలింగ్లో తొలి బంతిని ఫోర్ బాదిన తిరుమానె ఆ తర్వాత రెండో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
హెన్రీ వేసిన రెండో బంతి నేరుగా బ్యాట్స్మన్ ప్యాడ్కి తగిలినప్పటికీ అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. దీంతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెంటనే రివ్యూ కోరగా థర్డ్ అంపైర్ పరిశీలించారు. ఈ రివ్యూలో బంతి బ్యాట్కు తాకకపోగా, నేరుగా వెళ్లి స్టంప్స్ను తాకుతున్నట్లు కనిపించడంతో తిరుమానెను ఔట్గా ప్రకటించారు.
Matt Henry kicked off New Zealand's #CWC19 campaign with a bang, striking with their second ball of the tournament!https://t.co/VzkzqMbvO0
— Cricket World Cup (@cricketworldcup) June 1, 2019
దీంతో న్యూజిలాండ్ ఈ రివ్యూలో విజయవంతమైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన కుశాల్ పేరీరాతో కలిసి కరుణరత్నె ఇన్నింగ్స్ను చక్కదిద్దుతున్నాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టానికి 46 పరుగులు చేసింది. ప్రస్తుతం కుశాల్ పెరీరా(29), కరుణరత్నె(11) పరుగులతో క్రీజులో ఉన్నారు.
అంతకముందు టాస్ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్లండెల్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కివీస్ జట్టు ఒక స్పిన్నర్, ఇద్దరు ఆల్రౌండర్లను తీసుకుంది. లంక సీనియర్ బౌలర్లు నువాన్ ప్రదీప్, సౌథీలకు చోటు దక్కలేదు.
{headtohead_cricket_4_7}
జట్ల వివరాలు:
శ్రీలంక:
దిముత్ కరుణరత్నె (కెప్టెన్), తిరిమన్నె, కుషల్ పెరెరా, కుషల్ మెండిస్, మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, తిసార పెరెరా, జీవన్ మెండిస్, లక్మల్, ఇసురు ఉడాన, మలింగ.
న్యూజిలాండ్:
గుప్తిల్, మున్రో, విలియమ్సన్ (కెప్టెన్), టేలర్, లాథమ్, నీషమ్, గ్రాండ్హోమ్, శాంట్నర్, ఫెర్గూసన్, హెన్రీ, బౌల్ట్.