ప్రపంచకప్లో భాగంగా జూన్ 16న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించి జయకేతం ఎగురవేసింది. అయితే ఇదే మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం కూడా చోటుచేసుకుంది. గ్యాలరీలోని ఓ యువకుడు పెళ్లి ప్రపోజల్ చేసి తన ప్రియురాలి మనస్సును గెలుచుకున్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్ చేస్తోంది. ఈ సమయంలో గ్యాలరీలో ఉన్న టీమిండియా ఫ్యాన్ విక్కీ.. అక్కడే కూర్చున్న అన్వితా అనే యువతికి ఉంగరాన్ని చూపించి పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన అన్వితా అతడి ప్రేమను అగీకరించింది. అంతేకాదు గట్టిగా హత్తుకుని తన ప్రేమను వ్యక్తపరిచింది. అన్వితాకు విక్కీ ఉంగరం తొడిగిన అనంతరం ఇద్దరూ ముద్దు పెట్టుకున్నారు.
So this happened #INDvPAK #INDvsPAK #CricketWorldCup #Proposal pic.twitter.com/8lg8AcJvKv
— Anvita (@BebuJ) June 21, 2019
పక్కనే ఉన్న వారి స్నేహితులు వెల్ డన్ విక్కీ అంటూ ప్రోత్సహించారు. ఇక విక్కీ కెమెరా వైపు తమ జంటను చూపించాడు. ఈ సన్నివేశాన్ని చూసిన గ్యాలరీలోని ఇతర అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మ్యాచ్ టీమిండియాకే కాదు.. టీమిండియా అభిమానికి కూడా కలిసివచ్చింది. ఈ వీడియోను అన్వితా తన ట్విటర్లో పోస్టు చేసింది. 'ఇది భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో జరిగింది' అని అన్వితా రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో అందరిని ఆకట్టుకుంటోంది. నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ఇంకో సంఘటన కూడా జరిగింది. కెనడాకు చెందిన దంపతులు కూడా తమ దుస్తులతో అందరి మనసులు గెలుచుకున్నారు. దంపతులు ఇరుదేశాల జెర్సీలను కలిపి కుట్టించుకున్న డ్రెస్ వేసుకోని రెండు జట్లకు మద్దతు తెలిపారు. భర్తది పాకిస్తాన్ కాగా.. భార్యది భారత్. కెనడాలో ఈ జంట నివసిస్తున్నారు. ఈ ఫొటో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.