ప్రపంచకప్లో భాగంగా మరోకొద్ధి సేపట్లో చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ అభిమానులు. అయితే భారత అభిమానుల మనస్సులో ఓ ప్రశ్న మెదులుతూనే ఉంది. కీలక మ్యాచ్ కాబట్టి జట్టు కూర్పు ఎలా ఉండబోతుందా అని.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
పాక్తో మ్యాచ్లో ఇద్దరు స్పిన్నర్లకి బదులుగా ఒకరితోనే బరిలోకి దిగాలని టీమిండియా భావిస్తోంది. చైనామన్ బౌలర్ కుల్దీప్కి బదులు పేసర్ మహ్మద్ షమీని తీసుకునే అవకాశం ఉంది. రెండు రోజులుగా వర్షం పడుతుండడంతో పిచ్ పేసర్లకు అనుకూలిస్తోందని సమాచారం. దీంతో ముగ్గురు పేసర్లను ఆడించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. 'పాకిస్థాన్ బ్యాట్స్మెన్ స్పిన్ బౌలింగ్ను బాగా అడగలరు. కాబట్టి ఇద్దరు స్పిన్నర్లతో దిగడం సరైంది కాదని' హర్భజన్ కూడా అభిప్రాయపడ్డాడు.
రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా కొన్ని మ్యాచులకు దూరమవడంతో అతడి స్థానంలో నాలుగో నంబర్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు. దీంతో నాలుగో నంబర్లో ఆల్రౌండర్ విజయ్ శంకర్ ఆడే అవకాశం ఉంది. ఇదే నిజమయితే ప్రపంచకప్లో శంకర్ అరంగేట్రం చేయనున్నాడు. అయితే ఆదివారం పరిస్థితులను బట్టి జట్టులో మార్పులు ఉండే అవకాశం కూడా ఉంది. సీనియర్ బ్యాట్స్మన్ దినేష్ కార్తీక్ కూడా నాలుగో నంబర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రపంచకప్లో భాగంగా ఆడిన రెండు మ్యాచులలో టీమిండియా మంచి విజయాలను అందుకుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి పటిష్ట జట్లను ఓడించిన భారత్.. మరో విజయంపై కన్నేసింది. ఈ రోజు మ్యాచ్ గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీకి బదులు తీర్చుకోవాలని టీమిండియా చూస్తోంది.