ప్రపంచకప్లో భాగంగా మాంచెస్టర్ వేదికగా ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 89 పరుగుల (డక్వర్త్ లూయిస్) తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ స్టార్ పేసర్ మహ్మద్ అమిర్ను ఫీల్డ్ అంపైర్ రెండు సార్లు హెచ్చరించాడు. భారత ఇన్నింగ్స్ కొనసాగుతుండగా.. మూడో ఓవర్ మూడో బంతి వేసిన అనంతరం అమిర్ పిచ్పై పరిగెత్తాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ బ్రూస్ ఆక్పెన్ఫర్డ్.. అమిర్కు తొలి వార్నింగ్ ఇచ్చాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
వెంటనే పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అంపైర్ వద్దకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇక అంపైర్ వార్నింగ్ను ఏమాత్రం పట్టించుకోని అమిర్.. ఐదో ఓవర్లో మరోసారీ పిచ్పై పరిగెత్తాడు. దాంతో ఆగ్రహించిన ఆక్సెన్ఫర్డ్.. అమిర్ను రెండోసారి హెచ్చరించాడు. అయితే అంపైర్ హెచ్చరించినా కూడా ఆమిర్.. నవ్వు తూ కనిపించాడు.
మూడోసారి కూడా అమిర్కు అంపైర్ వార్నింగ్ ఇచ్చివుంటే.. ఈ మ్యాచ్ ఇన్నింగ్స్లో మళ్లీ బౌలింగ్ చేసేందుకు అతనికి అవకాశం ఉండకపోయేది. అమిర్ అనంతరం మరో పేస్ బౌలర్ వాహబ్ రియాజ్ రెండు సార్లు వార్నింగ్కు గురయ్యాడు. ఇన్నింగ్స్ 24వ ఓవర్లో వాహబ్ రియాజ్ను రెండు సార్లు అంపైర్లు హెచ్చరించారు. ఈ మ్యాచ్లో అమిర్ మూడు కీలక వికెట్లు తీసాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోనీలను పెవిలియన్ చేర్చాడు. తన కోటా 10 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అమీర్ చివర్లో అద్భుత ప్రదర్శన చేశాడు. తన పదునైన బంతులతో ఆసీస్ బ్యాట్స్మెన్కు ముచ్చెమటలు పట్టించాడు. ఈ మ్యాచ్లో 10 ఓవర్లు వేసిన ఆమీర్ 30 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో ఆమీర్కు ఇది తొలి ఐదు వికెట్ల హాల్ కావడం విశేషం.