మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్లో భారత్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్రపంచకప్లో పాకిస్తాన్పై తమకు ఎదురులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. ఏకంగా ఏడోసారి ఓడించి ప్రపంచకప్లో పాక్పై తన విజయ పరంపరను భారత్ కొనసాగించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. అనంతరం 337 పరుగుల లక్ష్య చేధనలో పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ను 40 ఓవర్లకు కుదించారు. దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్థాన్కు 40 ఓవర్లలో 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
అయితే, పాకిస్థాన్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసింది. ఈ విజయంతో భారత్ వరుసగా ఏడో సారి ప్రపంచకప్లో పాకిస్థాన్పై భారత్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన రోహిత్కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
Results of India v Pakistan in Men's World Cups:
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
1992: 🇮🇳
1996: 🇮🇳
1999: 🇮🇳
2003: 🇮🇳
2011: 🇮🇳
2015: 🇮🇳
2019: 🇮🇳 pic.twitter.com/BIOxOMZfM6
మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్లో భారత్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రపంచకప్లో పాక్పై భారత్కు ఇది ఏడో విజయం
India win by 89 runs!
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
A convincing victory for India as they win their third match of #CWC19#CWC19 | #INDvPAK pic.twitter.com/WIaNlki4AF
పాకిస్థాన్ లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ ప్రకారం సవరించారు. 40 ఓవర్లకు ఇన్నింగ్స్ను కుదించారు. 302ను లక్ష్యంగా విధించారు. అంటే ఇప్పుడు 30 బంతుల్లో ఆ జట్టు 136 పరుగులు చేయాలి.
Pakistan need 136 to win from five overs 😬#CWC19 | #INDvPAK https://t.co/pj5R3qFqPe
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
ప్రస్తుతం భారత్ విజయానికి 4 వికెట్ల దూరంలో ఉంది. వర్షంతో మ్యాచ్ కొనసాగేందుకు వీలుకాకుంటే డక్వర్త్ లూయిస్ ప్రకారం విజేతను ప్రకటించాల్సి ఉంటుంది. పాక్ విజయం సాధించాలంటే 35 ఓవర్లకు 252 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 86 పరుగుల దూరంలో ఉంది
That feeling when you take two wickets in two balls 😃 🙌 #CWC19 | #INDvPAK pic.twitter.com/r9JKVcgJoL
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
వర్షం పడుతున్న సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇలా
#ViratKohli isn't impressed by the rain.#CWC19 | #INDvPAK pic.twitter.com/K4rHLNFkJS
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
భారత్×పాక్ మ్యాచ్కు మరోసారి వరుణుడు అంతరాయం కలిగించాడు. చిరుజల్లులు మొదలవ్వడంతో ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. పిచ్పై కవర్లను కప్పారు. డక్వర్త్ లూయిస్ ప్రకారం కోహ్లీసేనకు విజయావకాశాలు ఉన్నాయి.
The rain comes down again at Old Trafford with India just four wickets away from victory 🌧️ ☔ #CWC19 | #INDvPAK pic.twitter.com/zfaWgB4QOZ
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
హార్దిక్ పాండ్యా హ్యాట్రిక్ వికెట్ తీయకుండా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అడ్డుకున్నాడు
Sarfaraz confidently blocks the hat-trick ball but India are very much on top now.#CWC19 | #INDvPAK https://t.co/kkCr4Avb8c
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
ఒకే ఓవర్లో వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన హార్దిక్ పాండ్యా. 26.5వ బంతికి హఫీజ్ను ఔట్ చేసిన అతడు తర్వాతి బంతికి షోయబ్ మాలిక్ (0; 1బంతుల్లో)ను గోల్డెన్ డక్గా పెవిలియన్ పంపించాడు.
TWO IN TWO!
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
Shoaib Malik is bowled first ball and Hardik Pandya is on a hat-trick!#CWC19 | #INDvPAK pic.twitter.com/57WlREBVMr
భారత్తో జరుగుతున్న మ్యాచ్లో ఫకార్ జమాన్ హాఫ్ సెంచరీ సాధించాడు.
50 for Fakhar Zaman 👏
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
He gets to his half-century in style with a six over mid-wicket!#CWC19 | #INDvPAK pic.twitter.com/jAE4YxRNKA
భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో బాబర్ ఆజామ్(13), ఫకార్ జమాన్(16) పరుగులతో ఉన్నారు.
#ViratKohli certainly enjoyed that wicket!#CWC19 | #INDvPAK pic.twitter.com/9DApuAo4E1
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
పాక్ తొలి వికెట్ కోల్పోయింది. విజయ్ శంకర్ బౌలింగ్లో పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్(7) పరుగుల వద్ద ఎల్బీగా పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం 5 ఓవర్లకు వికెట్ నష్టానికి పాకిస్థాన్ 14 పరుగులు చేసింది.
Incredible! Vijay Shankar, brought on to finish Kumar's over, takes a wicket with his first ball! https://t.co/IOxiktoo2r
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
ప్రపంచవ్యాప్తంగా భారత్-పాక్ మ్యాచ్ని అభిమానులు వీక్షిస్తున్నారిలా
Fans all around the world have been watching today's game wherever they can 📺 pic.twitter.com/PQpXgqlPHV
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
మాంచెస్టర్లో చిరుజల్లులు మళ్లీ మొదలయ్యాయి. మైదాన సిబ్బంది పిచ్పైకి మళ్లీ కవర్లు తీసుకొచ్చారు. దీంతో వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ సజావుగా కొనసాగుతుందో లేదో చూడాలి మరి.
ప్రపంచకప్లో భాగంగా పాక్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఓపెనర్లు లోకేశ్ రాహుల్-రోహిత్ శర్మలు తొలి వికెట్కు 136 పరుగులు జోడించారు. కేఎల్ రాహుల్(57) పరుగుల వద్ద రియాజ్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత రోహిత్ శర్మ సెంచరీ నమోదు చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 24వ సెంచరీ. అయితే, రోహిత్ శర్మ 113 బంతుల్లో140(14 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హసన్ అలీ బౌలింగ్లో రియాజ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా(26) బ్యాట్ను ఝళిపించినప్పటికీ భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని ఒక్క పరుగుకే ఔటయ్యాడు. ఈ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో కాసేపు మ్యాచ్ నిలిచిపోయింది. ఆట తిరిగి ప్రారంభమయ్యాక కోహ్లీ(77) పరుగుల వద్ద ఆమీర్ బౌలింగ్లో ఔటయ్యాడు. చివర్లో విజయ్ శంకర్(15), కేదార్ జాదవ్(9)పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ ఆమిర్ మూడు వికెట్లు పడగొట్టగా, హసన్ అలీ, వాహబ్ రియాజ్ చెరో వికెట్ తీసుకున్నారు.
Rohit Sharma's brilliant 140 and fifties from KL Rahul and Virat Kohli power India to 336/5. Can #SarfarazAhmed and Co. chase down the target?
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
Download the official #CWC19 app ⬇️
APPLE 👉 https://t.co/whJQyCahHr
ANDROID 👉 https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/VRwmwZxyY3
అంపైర్ ఔటివ్వకపోయినా విరాట్ కోహ్లీ స్వయంగా పెవిలియన్ వెళ్లాడు. అయితే, రిప్లేల్లో విరాట్ కోహ్లీ నాటౌట్ అని తేలింది. బంతికి, బ్యాటుకు చాలా దూరంగా వెళ్లింది. అయితే. ఔట్ అనుకుని విరాట్ కోహ్లీ పెవిలియన్ వచ్చేశాడు.
మరోసారి ఆమిర్ బౌలింగ్లోనే విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. ఆమీర్ వేసిన 47.4వ బంతికి విరాట్ కోహ్లీ (77; 65 బంతుల్లో 7 ఫోర్లు) వికెట్ కీపర్ సర్ఫరాజ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఈ మ్యాచ్లో అంపైర్ ఔటివ్వకపోయినా విరాట్ కోహ్లీ స్వయంగా పెవిలియన్ వెళ్లాడు.
Amir takes his third wicket and it's the important wicket of Virat Kohli!#CWC19 | #INDvPAK pic.twitter.com/1RIlS6FadO
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
వర్షం అనంతరం ఆట తిరిగి మొదలైంది.
Great news!
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
Play is set to resume in eight minutes.#CWC19 | #INDvPAK pic.twitter.com/KqkoueUM0s
మాంచెస్టర్లో వర్షం మరింతగా పెరిగింది. చిరుజల్లులుగా మొదలైన వాన ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. ఔట్ఫీల్డ్పై కప్పినట్టు కనిపించడం లేదు. ఓవర్లకు కుదించడానికి ముందు 75 నిమిషాల సమయం ఉంటుంది. వర్షంతో మ్యాచ్ నిలిచే సమయానికి46.4 ఓవర్లకు భారత్ 305/4తో ఉంది.
Ruk jaaa barish bas bi kar abh pic.twitter.com/5790hHkA8C
— Harbhajan Turbanator (@harbhajan_singh) June 16, 2019
భారత్-పాక్ మ్యాచ్కి వరుణుడు అంతరాయం కలిగించాడు. చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో అంఫైర్లు మ్యాచ్ను తాత్కాలికంగా నిలిపేశారు. వర్షంతో మ్యాచ్ నిలిచే సమయానికి46.4 ఓవర్లకు భారత్ 305/4తో ఉంది.
That's a shame.
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
Rain comes down in Manchester with 20 deliveries left in the India innings.#CWC19 | #INDvPAK pic.twitter.com/XgerntsRdy
పాక్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా 300 పరుగుల మార్కుని అందుకుంది. ప్రస్తుతం 46 ఓవర్లకు గాను నాలుగు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. క్రీజులో విజయ్ శంకర్(1), విరాట్ కోహ్లీ (70) పరుగులతో ఉన్నారు.
India pass 300 in the 46th over!#CWC19 | #INDvPAK pic.twitter.com/4BzpKgfmDb
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
ఈ మ్యాచ్లో కింగ్ కోహ్లీ 57 పరుగులు చేయడంతో వన్డేల్లో 11వేల పరుగులు పూర్తిచేసిన తొమ్మిదో ఆటగాడిగా అతడు అరుదైన ఘనత సాధించాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్లో 11వేల మైలురాయిని అందుకున్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు కేవలం 221 ఇన్నింగ్స్లు మాత్రమే ఆడటం విశేషం. అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో అత్యంత వేగంగా రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు చేశాడు.
#ViratKohli scores his 11,000th ODI run!
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
He reaches the landmark in 54 fewer innings than anyone else 👀 pic.twitter.com/mebDOLJESs
పాక్ పేసర్ ఆమీర్ చెలరేగుతున్నాడు. ఇప్పటికె రెండు వికెట్లు పడగొట్టాడు. జట్టు స్కోరు 298 పరగుల వద్ద ధోని(1) ఆమీర్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 46 ఓవర్లకు గాను నాలుగు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. క్రీజులో విజయ్ శంకర్(1), విరాట్ కోహ్లీ (70) పరుగులతో ఉన్నారు.
Amir strikes!
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
Pandya attempts the helicopter shot and he's caught on the boundary by Babar Azam 🚁 pic.twitter.com/IjKnQ10D5e
పాక్తో జరుగుతున్న మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. మహ్మద్ ఆమిర్ వేసిన 43.1వ బంతికి రెండు పరుగులు తీసి విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 44 ఓవర్లకు గాను మూడు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (56), ధోని(0) పరుగులతో ఉన్నారు.
#ViratKohli brings up his 50 👏 👏 #TeamIndia | #CWC19 | #INDvPAK pic.twitter.com/dR7T7pTtOl
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
పాక్తో జరుగుతున్న మ్యాచ్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా
Hardik Pandya comes out to bat at number four for India...#CWC19 | #INDvPAK pic.twitter.com/xtjuCyKCqt
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
రోహిత్ శర్మ ఔటయ్యాడు. రోహిత్ శర్మ 113 బంతుల్లో 140(14 ఫోర్లు, 3 సిక్సులు) పరుగుల వద్ద హసన్ అలీ వేసిన 38.2వ బంతికి అతడు రియాజ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి పాండ్యా వచ్చాడు. ప్రస్తుతం 39 ఓవర్లకు గాను రెండు వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. క్రీజులో పాండ్యా(4), విరాట్ కోహ్లీ (30) పరుగులతో ఉన్నారు.
Rohit Sharma finally goes for a quite brilliant 140!
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
Hassan Ali is the man with the wicket, India are 234/2. #CWC19 | #INDvPAK pic.twitter.com/rJf8ejAVdw
రోహిత్ శర్మ సెంచరిపై మాంచెస్టర్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఐసీసీ తన ట్విట్టర్లో పంచుకుంది.
💯 🙌 👏
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
The Manchester crowd react to Rohit Sharma reaching his hundred!#CWC19 | #INDvPAK | #TeamIndia pic.twitter.com/1a61JGJJt6
పాక్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా 200 పరుగుల మార్కుని అందుకుంది. ప్రస్తుతం 35 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 206 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(119), విరాట్ కోహ్లీ (24) పరుగులతో ఉన్నారు.
200 up for India in the 35th over! #CWC19 | #INDvPAK pic.twitter.com/qo3hAbhuQU
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
Fewest innings to 24 ODI 100s: 142 H Amla 161 V Kohli 192 AB de Villiers 203 ROHIT SHARMA 219 S Tendulkar
వన్డేల్లో రోహిత్ శర్మ ఇప్పటివరకు మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం పాక్తో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ శర్మ మరో డబుల్ సెంచరీ సాధిస్తాడా?
Rohit Sharma has scored three ODI double centuries in his career so far.
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
Could he hit a fourth today?#CWC19 | #INDvPAK | #TeamIndia pic.twitter.com/pkgC47hAi1
ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 30వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి రోహిత్ శర్మ 85 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో సెంచరీ సాధించాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 24వ సెంచరీ. ఈ సిరిస్లో రోహిత్ శర్మకు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. దీంతో 30 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టానికి 172 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(100), విరాట్ కోహ్లీ (9) పరుగులతో ఉన్నారు.
100 for Rohit Sharma!
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
His second in just three #CWC19 innings 💪 #CWC19 | #TeamIndia | #INDvPAK pic.twitter.com/KKMq1Ft1MG
కేఎల్ రాహుల్(57)ని మొదటి వికెట్గా పెవిలియన్కు చేర్చిన వాహబ్ రియాజ్. 28 ఓవర్లకు గాను భారత్ వికెట్ నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(94), విరాట్ కోహ్లీ (7) పరుగులతో ఉన్నారు.
Wahab Riaz was the man to make the first Pakistan breakthrough, dismissing KL Rahul for 57.
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
Watch the wicket on our dedicated #CWC19 app.
DOWNLOAD ⬇️
APPLE 👉 https://t.co/whJQyCahHr
ANDROID 👉 https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/uKfR5XHWDZ
25 ఓవర్లకు గాను భారత్ వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ ఔటైన తర్వాత క్రీజులోకి విరాట్ కోహ్లీ వచ్చాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(81), విరాట్ కోహ్లీ (3) పరుగులతో ఉన్నారు.
Virat Kohli comes to the crease.
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
The last time he batted against Pakistan in the World Cup, he scored a match-winning century 👀 #CWC19 | #INDvPAK pic.twitter.com/66gxWrA294
జట్టు స్కోరు 136 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. వాహబ్ వేసిన 23.5 బంతిని షాట్ ఆడిన కేఎల్ రాహుల్(57) పరుగుల వద్ద బాబర్ అజామ్ చేతికి చిక్కాడు.
పాక్తో జరుగుతున్న మ్యాచ్లో కేఎల్ రాహుల్.. మాలిక్ వేసిన 21.4బంతిని సిక్స్గా మలిచి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 69 బంతుల్లో 3 పోర్లు, ఒక సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 22 ఓవర్లకు గాను 123 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(69), రాహుల్ (51) పరుగులతో ఉన్నారు.
Rahul brings up his 50 with a six!#CWC19 | #TeamIndia | #INDvPAK pic.twitter.com/zTW8RH68rJ
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
ప్రపంచకప్లో పాక్పై 100కుపైగా భాగస్వామ్యాలను నమోదు చేసిన ఓపెనర్లు వీరే: 132 G Greenidge - D Haynes, Oval, 1979 115 G Fowler - C Tavare, Manchester, 1983 175*D Haynes - B Lara, MCG, 1992 147 R Smith - M Atherton, Karachi, 1996 146 D Warner - A Finch, Taunton, 2019 104*R SHARMA - KL RAHUL, Manchester, 2019
పాక్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా 100 పరుగుల మార్క్ని అందుకుంది. ప్రస్తుతం 18 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టపోకుండా 101 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(61), రాహుల్ (37) పరుగులతో ఉన్నారు.
India bring up their 💯 without losing a wicket!#CWC19 | #INDvPAK pic.twitter.com/1wrWn6VKwW
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
రనౌట్ నుంచి తప్పించుకున్న రోహిత్ శర్మ
Pakistan so nearly took an early wicket after a mix-up between Rohit Sharma and KL Rahul!
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
Watch the potentially game-changing moment on our #CWC19 app ⬇️
DOWNLOAD ⬇️
APPLE 👉 https://t.co/whJQyCahHr
ANDROID 👉 https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/7SAuZhTxsS
15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. మరోవైపు పాక్ స్పిన్నర్లు కట్టడి చేస్తున్నారు. ఆరంభ ఓవర్లలో పరుగులు ఇచ్చినా.. ఆ తర్వాత భారత బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. క్రీజులో రోహిత్ శర్మ(53), రాహుల్ (32) పరుగులతో ఉన్నారు.
రోహిత్ హాఫ్ సెంచరీ సాధించాడు. షాదాబ్ వేసిన నాలుగో బంతిని భారీ సిక్సర్గా మలచగా... ఆ తర్వాతి బంతిని బౌండరీకి తరలించి రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మకు ఇది మూడో సెంచరీ. ప్రస్తుతం 12 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ కోల్పోకుండా 79 పరుగులు చేసింది, క్రీజులో రోహిత్ శర్మ(50), రాహుల్ (27) పరుగులతో ఉన్నారు.
122* v 🇿🇦
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
57 v 🇦🇺
50* v 🇵🇰 today
The Hitman continues his sublime #CWC19 form 👌 pic.twitter.com/B9HVSifDnN
మాంచెస్టర్ వేదికగా పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం 10 ఓవర్లకు గాను వికెట్ కోల్పోకుండా టీమిండియా 53 పరుగులు చేసింది. అయితే, ఈ ఓవర్ తొలి బంతికే రోహిత్(37) రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.పాక్ ఫీల్డర్ల సమన్వయ లోపం వల్ల రోహిత్ బతికిపోయాడు. కాగా ఆఖరి బంతిని మాత్రం రోహిత్ తనదైన స్టైల్లో బౌండరీకి తరలించి ఒత్తిడి తగ్గించాడు.క్రీజులో రోహిత్ శర్మ(37), కేఎల్ రాహుల్(14) పరుగులతో ఉన్నారు.
5️⃣3️⃣/0️⃣
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
Great start from India in Manchester!
FOLLOW ON OUR #CWC19 APP ⬇️
APPLE 👉 https://t.co/whJQyCahHr
ANDROID 👉 https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/OqVl2YoR7m
ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన స్సిన్నర్ ఇమాద్ వసీం ఆకట్టుకున్నాడు. ఈ ఓవర్లో 4 పరుగులే ఇచ్చాడు. దీంతో 9 ఓవర్లకుగాను టీమిండియా వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(32), కేఎల్ రాహుల్(12) పరుగులతో ఉన్నారు.
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న భారత్-పాక్ మ్యాచ్లో సినీ నటి మంచు లక్ష్మి సందడి చేశారు. భారత్కు మద్దతుగా జాతీయ జెండాతో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. పాక్పై టీమిండియా గెలవాలని ఆమె ఆకాంక్షించారు.
మాంచెస్టర్ వదికగా పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. ప్రస్తుతం 7 ఓవర్లకుగాను వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేశారు. క్రీజులో రోహిత్ శర్మ(26), కేఎల్ రాహుల్(8) పరుగులతో ఉన్నారు.
Rohit Sharma has got off to a flying start!
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
He's already on 26* after just the first seven overs.
FOLLOW ON OUR #CWC19 APP ⬇️
APPLE 👉 https://t.co/whJQyCahHr
ANDROID 👉 https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/IySHc7x54O
భారత్-పాక్ మ్యాచ్కి హాజరైన బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్.
Look who gave a low down of the BIG CLASH between India & Pakistan LIVE from Old Trafford before the start of the game - @RanveerOfficial himself #TeamIndia #INDvPAK #CWC19 🇮🇳💙😎👌 pic.twitter.com/NaNKOY5YEw
— BCCI (@BCCI) June 16, 2019
5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(16), కేఎల్ రాహుల్(4) పరుగులతో ఉన్నారు.
భారత్-పాక్ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడిన సంగతి తెలిసిందే. అయితే, టాస్ ఓడటం మంచికేనా అంటే అవుననే అంటున్నారు. ఇంగ్లాండ్లో వర్షాలు పడటం ఆందోళన కలిగించే అంశం. భారత్, పాక్ మ్యాచ్లో ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్పై పచ్చిక కూడా లేదు. వర్ష ప్రభావం నేపథ్యంలో ఆరంభంలో ఫాస్ట్బౌలర్లను ఎదుర్కోవడం బ్యాట్స్మెన్కు కొంచెం కష్టంగా ఉంటుంది. ఐతే రికార్డు పరిశీలిస్తే ఛేదనలో పాక్ ఎక్కువసార్లు తడబడుతున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. మెగా టోర్నీలో టీమిండియా చేతిలో ఓడిన ఆరు మ్యాచ్ల్లో(2003 మినహా) ఐదు సార్లు పాక్ రెండోసారి బ్యాటింగ్ చేసింది.
తొలి ఓవర్ను పాక్ పేసర్ మహ్మద్ ఆమీర్ కట్టుదిట్టంగా వేశాడు. దీంతో భారత ఓపెనర్లు ఢిఫెన్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో పరుగులేమీ చేయలేదు.
Aaaand a maiden to start things off.
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
Mohammad Amir gives nothing away with the new ball in the first over.
FOLLOW ON OUR #CWC19 APP ⬇️
APPLE 👉 https://t.co/whJQyCahHr
ANDROID 👉 https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/6KjpCDF8zD
జట్ల వివరాలు:
How the teams stack up 😎🇮🇳 #TeamIndia #INDvPAK #CWC19 pic.twitter.com/OK2rLOcViO
— BCCI (@BCCI) June 16, 2019
టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయపడ్డ శిఖర్ ధావన్ స్థానంలో రోహిత్తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనుండగా.. నాలుగో స్థానానికి ఆల్రౌండర్ విజయ్ శంకర్ను తుదిజట్టుకు ఎంపిక చేసినట్లు విరాట్ చెప్పాడు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో బౌలింగ్ ఎంచుకున్నామని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపాడు.
Shadab Khan ✅
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
Imad Wasim ✅
Vijay Shankar ✅
Two changes for Pakistan, one change for India ahead of the big game today.
FOLLOW ON OUR #CWC19 APP ⬇️
APPLE 👉 https://t.co/whJQyCahHr
ANDROID 👉 https://t.co/Lsp1fBwBKR pic.twitter.com/rvrPvqXt30
భారత్-పాక్ మ్యాచ్ కాడవంతో పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు. ముఖ్యంగా టీమిండియాకు మద్దకు వేల కొద్దీ అభిమానులు స్టేడియానికి చేరుకుని ఇండియా ఇండియా అంటూ కేకలు పెడుతున్నారు.
Indiaaaa Indiaaa 🇮🇳🇮🇳#CWC19 #TeamIndia pic.twitter.com/uTU4Qtwv7Q
— BCCI (@BCCI) June 16, 2019
పాకిస్థాన్: ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్, మహ్మద్ హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్, షోయబ్ మాలిక్, వసీమ్, ఖాన్, అలీ, వాహబ్ రియాజ్, మహ్మద్ ఆమీర్
టీమిండియా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, విజయ్ శంకర్, కేదార్ జాదవ్, ధోని, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
Pakistan wins the toss and elect to bowl first against #TeamIndia pic.twitter.com/7XZkwH7YxR
— BCCI (@BCCI) June 16, 2019
భారత్-పాక్ మ్యాచ్కి సర్వం సిద్ధం. ఇరు జట్లు ఇప్పిటకే స్టేడియానికి చేరుకున్నాయి. మరో పది నిమిషాల్లో టాస్ వేయనున్నారు.
The players are here, the fans are here – the toss is less than 10 minutes away!#CWC19 | #INDvPAK pic.twitter.com/aWJZxH0EOn
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
తెల్లటి గుర్రంపై పాక్ జెండూ ఊపుతూ మాంచెస్టర్ స్టేడియానికి చేరుకున్న పాక్ అభిమాని
This is officially the BEST way to arrive at a cricket match 😂 #CWC19 | #INDvPAK pic.twitter.com/cuzg1jVSWU
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
భారత్-పాక్ మ్యాచ్ని వీక్షించేందుకు గాను వెస్టిండీస్ దిగ్గజం క్రిస్గేల్ ప్రత్యేకమైన డ్రెస్తో సిద్ధమయ్యాడు. ఒక వైపు భారత పతాకం రంగులు, మరో వైపు పాక్ జెండా రంగులతో ఉన్న డ్రెస్ను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. తన బర్త్డే(సెప్టెంబర్ 20)కు కూడా ఇదే డ్రెస్ ధరిస్తానంటూ క్యాప్షన్గా పేర్కొన్నాడు.
మాంచెస్టర్ స్టేడియానికి చేరుకున్న టీమిండియా. మ్యాచ్ పైనే ఫోకస్ పెట్టిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.
Concentration level 💯 pic.twitter.com/fWhyJe7LLM
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
మాంచెస్టర్ స్టేడియంలో భారత్-పాక్ అభిమానుల మూడ్ ఇలా ఉంది
Mood!#WeHaveWeWill #TeamIndia #CWC19 pic.twitter.com/lrG9dvgbZ7
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
పాక్తో మ్యాచ్లో కింగ్ కోహ్లీ 57 పరుగులు చేస్తే వన్డేల్లో 11వేల పరుగులు పూర్తిచేసిన తొమ్మిదో ఆటగాడిగా అతడు అరుదైన ఘనత అందుకోనున్నాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్లో 11వేల మైలురాయిని అందుకున్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు కేవలం 221 ఇన్నింగ్స్లు మాత్రమే ఆడటం విశేషం. అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో అత్యంత వేగంగా రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు చేయనున్నాడు.
భారత్-పాక్ మ్యాచ్కి ఆతిథ్యమిస్తోన్న మాంచెస్టర్ లో ఆదివారం ఉదయం వాతావరణం ఇలా ఉంది.
Early bid🐦 catches the ... best of the sunshine⛅️ on Sunday; heavy showers🌦️ will become more widespread through the morning pic.twitter.com/cfcnMkAHvM
— Met Office (@metoffice) June 15, 2019
{headtohead_cricket_3_5}