న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్-భారత్ మ్యాచ్‌: పిల్లల కోసం.. ఫోర్‌, వికెట్‌కు 500 డాలర్లు

 Unicef to celebrate OneDay4Children

ప్రపంచ‌కప్‌లో భాగంగా ఆదివారం బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న భారత్‌, ఇంగ్లండ్ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ మ్యాచ్‌ ద్వారా బాలల క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ - యూనిసెఫ్ ఉమ్మడిగా నిధులు సమీకరిస్తున్నాయి. 'క్రికెట్ ఫర్ గుడ్' అంటూ 'వన్ డే ఫర్ చిల్డ్రన్' అనే కార్యక్రమంను ఐసీసీ నిర్వహిస్తోంది. దీని ద్వారా వచ్చే విరాళాలను ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడే దేశాల్లో చిన్నారుల క్రీడల కోసం ఉపయోగించనున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ కార్యక్రమంలో భాగంగా ముగ్గురు పిల్లల్ని ఐసీసీ ఎంపిక చేసింది. మైదానానికి వచ్చిన ప్రేక్షకుల నుంచి ఈ ముగ్గురు పిల్లలు విరాళాలను సేకరించాలి. మ్యాచ్ మధ్యలో కామెంటేటర్లు, న్యూస్ ప్రెజెంటర్లు కూడా ఈ కార్యక్రమం గురుంచి ప్రసంగిస్తారు. దీంతో ప్రేక్షకులకు 'వన్ డే ఫర్ చిల్డ్రన్' లక్ష్యం తెలుపుతారు. మరోవైపు పిల్లలు కూడా మైదానంలోని ప్రేక్షకులను కలిసి తమ లక్ష్యాన్ని చెప్పి.. విరాళాలను సేకరిస్తారు.

1
43681

ఈ కార్యక్రమానికి ఉబర్ సంస్థ కూడా తమ వంతు సాయం చేయడానికి ముందుకొచ్చింది. ప్రతి ఫోర్‌కు 500 డాలర్లు, వికెట్‌కు 500 డాలర్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. స్టేడియంకి వచ్చిన 25వేల మంది ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ చూసే క్రీడాభిమానుల నుంచి విరాళాలు సేకరించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

{headtohead_cricket_2_3}

Story first published: Sunday, June 30, 2019, 20:26 [IST]
Other articles published on Jun 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X