అతి మర్యాద ఇచ్చారు:
తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ... 'వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. అయినా మధ్య ఓవర్లలో భారత బ్యాటింగ్ ప్రదర్శన బాగాలేదు. అఫ్గాన్ బౌలర్లు మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్ బాగా బౌలింగ్ చేశారు. అయినా భారత్ను 225 పరుగులలోపే కట్టడి చేసేంత ప్రదర్శన కాదు. అఫ్గాన్ బౌలర్లకు టీమిండియా బ్యాట్స్మెన్ అతి మర్యాద ఇచ్చారు' అని శ్రీకాంత్ పేర్కొన్నారు.
గట్టి హెచ్చరిక:
ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన కెప్టెన్సీ చేసాడు. కీలక సమయాల్లో నిర్ణయాలు ఫలితాన్ని ఇచ్చాయి. అఫ్గాన్ ఆఖరి వరకూ పోరాడినా టీమిండియా గెలవడం ముఖ్యం. ఇలాంటి ఉత్కంఠ మ్యాచ్ నేను ఊహించలేదు. ప్రపంచకప్లో ఇలాంటి మ్యాచ్లు అవసరం. టీమిండియాకు కూడా. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా ఏ జట్టును తేలికగా తీసుకోవద్దని ఇంగ్లాండ్కు తెలిసే ఉంటుంది. టీమిండియా, ఇంగ్లాండ్ జట్లకు ఇవి గట్టి హెచ్చరిక' అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
సెమీస్ చేరడం లాంఛనమే:
టీమిండియా తన తదుపరి మ్యాచ్లను విండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో ఆడనుంది. ఇంగ్లండ్ మినహా అన్ని జట్లు ఫామ్ లో లేవు. టీమిండియా సెమీస్ చేరడం లాంఛనమే. మరోవైపు దక్షిణాఫ్రికాపై విజయంతో ఇంగ్లండ్ శుభారంభం చేసినా.. తమకంటే ఎంతో బలహీనమైన జట్లయిన పాక్, లంక చేతుల్లో ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్కు మిగిలిన మ్యాచ్లన్నీ కఠినమైన ప్రత్యర్థులతోనే. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓడితే ఆ జట్టు నాకౌట్ దశ అవకాశాలకు దెబ్బపడినా ఆశ్చర్యం లేదు.