న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాపై ఎలాంటి అంచనాలు లేవు: న్యూజిలాండ్‌ కోచ్‌

ICC Cricket World Cup 2019, for India vs New Zealand semifinal: Level of expectation more on India than New Zealand says Coach Garry Stead

న్యూజిలాండ్‌ జట్టుపై ఎలాంటి అంచనాలు లేవు. మాకు ఇది కలిసొచ్చే అంశం. ప్రస్తుతం భారత్‌ మీదే ఎక్కువ ఒత్తిడి ఉంది అని న్యూజిలాండ్‌ కోచ్‌ గ్యారీ స్టీడ్‌ పేర్కొన్నారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్‌ గెలవడం, దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానం సాధించింది. దీంతో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌ (11 పాయింట్లు)తో మంగళవారం మాంచెస్టర్‌లో మొదటి సెమీఫైనల్‌ పోరుకు భారత్ సిద్ధమైంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

భారత్‌, న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ నేపథ్యంలో కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్‌ మాట్లాడుతూ... 'భారీ అంచనాలతో భారత్‌ సెమీస్‌లో అడుగుపెట్టింది. కావున భారత్‌ మీదనే ఒత్తిడి ఎక్కువ. మా మీద ఎలాంటి అంచనాలు లేవు. ప్రస్తుతం న్యూజిలాండ్‌పై ఎలాంటి ఒత్తిడి లేదు. ఇది మాకు కలిసొచ్చే అంశం. పూర్తిస్థాయి సామర్థ్యంతో స్వేచ్ఛగా ఆడతాం. నాకౌట్‌లో రెండో అవకాశం ఉండదు. కాచిహ్తంగా గెలవాల్సిందే. మా దృష్టిలో ప్రజలు మేం గెలుస్తామని అనుకోవడం లేదు. అయితే ఫైనల్ పోరులో నిలవడంపైనే దృష్టి పెట్టాం. భారత్ పటిష్ట జట్టు. జట్టులో మ్యాచ్‌ విన్నర్స్‌ ఉన్నారు. ఉత్తమ ప్రదర్శన చేస్తేనే విజయం వరిస్తుంది' అని గ్యారీ స్టీడ్‌ అన్నారు.

ఈ ప్రపంచకప్‌లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా ఉన్న కివీస్ స్టార్ బౌలర్‌ లాకీ ఫెర్గూసన్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ సందర్భంగా ఫెర్గూసన్‌ మాట్లాడుతూ... 'అంచనాలు లేకుండా సెమీస్‌ పోరులో ఆడడం మంచిదే. ఎలాంటి ఒత్తిడి లేకుండా మ్యాచ్‌కు సిద్ధమవుతాం. అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం. ప్రణాళికలు అమలు చేస్తాం' అని తెలిపాడు.

ఈ ప్రపంచకప్‌లో తొలి దశలో వరుస ఆరు విజయాలతో చెలరేగిన న్యూజిలాండ్‌.. ఆఖర్లో హ్యాట్రిక్ ఓటములతో నాకౌట్ బెర్తుకు ఎసరు తెచ్చుకుంది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి పటిష్ట జట్ల చేతిలో ఓడిపోయింది. ఇక భారత్ చేతిలో ఇంగ్లండ్ ఓడి ఉంటే.. న్యూజిలాండ్ స్థానంలో పాకిస్థాన్ సెమీస్‌లోకి వచ్చేది. కానీ ఫలితం అందుకు విరుద్ధంగా రావడం కివీస్‌కు కలిసొచ్చింది. లీగ్ దశలో వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు కాగా సెమీస్‌లో ఇవే రెండు జట్లు తలపడనున్నాయి.

Story first published: Monday, July 8, 2019, 13:33 [IST]
Other articles published on Jul 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X