
రాహుల్పై ఒత్తిడి పెంచండి:
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ధోనీకి మద్దతుగా నిలిచాడు. తాజాగా మంజ్రేకర్ మాట్లాడుతూ... 'మీడియా ధోనీపై ఎక్కువ దృష్టి సారించవద్దు. ఈ వయసులో ధోనీని విమర్శించడం సరికాదు. కేఎల్ రాహల్ కూడా అంతగా రాణించలేదు. టీమిండియా అభిమానే అయితే ధోనీపై కాదు.. కేఎల్ రాహుల్పై ఒత్తిడి తీసుకురావాలి. యువకులు జట్టుని గెలిపించేందుకు బాధ్యతలు తీసుకోవాలి' అని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

మయాంక్ క్లాస్ ప్లేయర్:
'వార్మప్ మ్యాచ్ల్లో ధోనీ బ్యాటింగ్ చూసి సంతోషించా. అతడిపై మరింత ఒత్తిడి పెంచొద్దు. ధోనీ ఎన్ని పరుగులు చేసినా అవసరం లేదు.. అతను ఆత్మరక్షణలో ఆడటం అర్థంచేసుకోగను. పంత్, రాహుల్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. కీలక సమయంలో వారు గాడిలో పడితే తిరుగుండదు. విజయ్ శంకర్కి బదులు మయాంక్ అగర్వాల్ని ఎంపిక చెయ్యడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మయాంక్ క్లాస్ ప్లేయర్' అని మంజ్రేకర్ కొనియాడాడు.

ఇలా ఆడడం తగదు:
'ఈ ఆట గురించి చెప్పడానికి, సింగిల్స్ గురించి తన దగ్గర సమాధానం లేదు. చేతిలో 5 వికెట్లు ఉన్నప్పుడు ఒక సీనియర్ ఆటగాడు ఇలా ఆడడం తగదు. గెలిచినా, ఓడినా సరే.. భారీ షాట్లతో పరుగులు తీయాల్సి ఉంది. సమయాన్ని బట్టి ధోనీ రిస్క్ తీసుకుని ఉంటే బాగుండేది. ఎంతో అనుభవం ఉన్నప్పటికీ నేర్చుకోవలసిన అవసరం కూడా అంతే ఉంది' అని మాజీ కెప్టెన్ సౌరవ్ గుంగూలీ ఘాటుగా వ్యాఖ్యానించాడు.


Click it and Unblock the Notifications
