
ఆరెంజ్ కలర్ను ఎందుకు ఎంచుకున్నారు?
"మోడీ జీ ఈ దేశాన్ని కాషాయమయం చేయాలని చూస్తున్నారు. త్రివర్ణ పతాకంలో మూడు రంగులు ఉన్నాయి కదా. వాటిని కాదని ఆరెంజ్ కలర్ను ఎందుకు ఎంచుకున్నారు? దేశానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆటగాళ్లు జాతీయ జెండాలో ఉన్న మూడు రంగుల్లో ఏదో ఒకటి అయితే బాగుంటుంది" అని అన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే నషీమ్ ఖాన్ మాట్లాడుతూ
మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నషీమ్ ఖాన్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కాషాయ రంగు రాజకీయాలను చేస్తోందని అన్నారు. "మోడ్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కాషాయ రంగు రాజకీయాలు చేస్తోంది. త్రివర్ణ పతాకాన్ని గౌరవించడంతో పాటు జాతీయ సామరస్యాన్ని ప్రోత్సహించాలి. ప్రభుత్వం మాత్రం అంతటా కాషాయాన్ని ప్రోత్సహిస్తోంది" అని విమర్శించారు.
అసలేం జరిగింది?
ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో ఐసీసీ నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశం మినహాయించి ప్రతి జట్టు రెండు రంగుల కిట్ల వివరాల్ని అందజేయాలి. రెండు జట్ల జెర్సీల రంగు ఒకే విధంగా ఉన్నప్పుడు అందులో ఒక జట్టు.. వేరే రంగు జెర్సీని ధరించాలి. ఈ మెగా టోర్నీలో ఆడుతోన్న ఇంగ్లాండ్, ఆప్ఘనిస్థాన్, శ్రీలంక దేశాల జెర్సీలు కూడా టీమిండియా ధరించే నీలి రంగు జెర్సీలను పోలి ఉండటంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్లో ఆరెంజ్ కలర్ జెర్సీతో
ఇందులో భాగంగా ఇంగ్లాండ్, శ్రీలంకతో జరిగే మ్యాచ్ల్లో కోహ్లీసేన నారింజ రంగు జెర్సీల్లో దిగనుంది. కాగా, ఇప్పటికే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు కొత్త జెర్సీలతో బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. 1992 వరల్డ్కప్లో ఇంగ్లాండ్ ధరించిన నేవీ బ్లూ కలర్ జెర్సీతో ఈ టోర్నమెంట్ ఆడుతుండగా ఆప్ఘనిస్థాన్ కూడా సరిగ్గా అలాంటి జెర్సీతోనే బరిలోకి దిగుతుండటం విశేషం. లంక కూడా ఈ వరల్డ్కప్లో బ్లూ కలర్ జెర్సీతో బరిలోకి దిగుతోంది.


Click it and Unblock the Notifications












