రెండు విజయాలు:
భారత్కు ఇంకా నాలుగు మ్యాచ్లు ఉన్నాయి. ఈనెల 27న వెస్టిండీస్ (మాంచెస్టర్), 30న ఇంగ్లాండ్ (బర్మింగ్హామ్), జులైన 2న బంగ్లాదేశ్ (బర్మింగ్హామ్), 6న శ్రీలంక (లీడ్స్)లతో తలపడనుంది. వీటిలో రెండు మ్యాచ్లు గెలిస్తే చాలు భారత్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. వెస్టిండీస్, శ్రీలంకలపై విజయం సులువే. ఇక ఇంగ్లాండ్, బంగ్లాదేశ్లు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మ్యాచ్ కోల్పోయే ప్రమాదం ఉంది.
అద్భుత ఫామ్లో:
ఇంకా ముఖ్యంగా బంగ్లాదేశ్తో జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి 2007 ప్రపంచకప్లో భారత్ను ఓడించి ఇంటిదారి పట్టించింది బంగ్లా. రెండోది ప్రస్తుత జట్టులో ఆల్రౌండర్ షకిబ్ అల్ హసన్ అద్భుత ఫామ్లో ఉండడం. మంగళవారం ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మ్యాచ్ ముందు వరకు షకిబ్ టోర్నీలో టాప్ బ్యాట్స్మన్గా ఉన్నాడు. ఈ మ్యాచ్లో వార్నర్ (500), ఫించ్ (496) చెలరేగడంతో మూడో స్థానంలోకి వెళ్ళాడు. షకిబ్ (476) ఇప్పటికే రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు చేసాడు.
షకీబ్తో జాగ్రత్త:
బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లో షకిబ్ రాణిస్తున్నాడు. అఫ్గాన్తో మ్యాచ్లో బంతితోనూ మెరిశాడు. ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా షకీబ్తో జాగ్రత్తగా ఉండాల్సిందే. భారత బౌలర్లు షకిబ్ను త్వరగా పెవిలియన్ చేర్చితే బంగ్లా పనిపట్టొచ్చు. 'భారత్తో మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం. బలమైన టీమిండియాను ఓడిస్తాం' అని షకీబ్ అన్నాడు.