|
గాయంలో ఎలాంటి మార్పూ లేదు:
మొదటగా ధావన్ కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుందని జట్టు యాజమాన్యం ఆశించారు. గాయం కారణంగా మూడు మ్యాచులకు దూరమంటూ వార్తలు వచ్చాయి. మరోవైపు అతనికి ఫిజియోథెరపీ నిర్వహించారు. అయినప్పటికీ.. గాయంలో ఎలాంటి మార్పూ రాలేదు. వేలికి మరింత వాపు వచ్చింది. దీంతో టోర్నీ నుంచే ధావన్ దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా తెలిపింది.
|
మ్యాచ్లు ఆడే పరిస్థితుల్లో లేడు:
'శిఖర్ ధావన్ ఎడమ బొటన వేలి ఎముక విరిగింది. ప్రస్తుతం అతడు మ్యాచ్లు ఆడే పరిస్థితుల్లో లేడు. తాజా అతడి పరిస్థితిని అంచనా వేయగా.. జూలై రెండో వారం వరకు కోలుకొనే అవకాశం కనిపించడం లేదు. దాంతో ధావన్ పంచకప్లోని అన్ని మ్యాచ్ల నుంచి వైదొలగాల్సివస్తోంది' అని భారత జట్టు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ సునీల్ సుబ్రహ్మణ్యం బుధవారం వెల్లడించాడు. 'శిఖర్కు బదులు జట్టులోకి పంత్ను అనుమతించాలని ఐసీసీని కోరాం' అని కూడా తెలిపాడు. ఈ విషయాన్ని సుబ్రహ్మణ్యం ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.
ప్రపంచకప్కు దూరం అవుతున్నా:
బీసీసీఐ అధికారిక ప్రకటన అనంతరం ధావన్ ఎమోషనల్ అవుతూ తన ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశాడు. 'బొటనవేలు గాయం ఇంకా తగ్గలేదు. దురదృష్టవశాత్తు ప్రపంచకప్కు దూరం అవుతున్నా. ఏదేమైనా టీమిండియా విజయపరంపర కొనసాగాలి. నాపై ప్రేమానురాగాలు చూపించిన వారికి, కష్టకాలంలో అండగా నిలిచిన నా జట్టు సబ్యులకు, క్రికెట్ అభిమానులకు, ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్' అంటూ పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఇక మైదానంలో గబ్బర్ ఆటను చూడలేమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.