ప్రపంచకప్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాట్స్మన్ షకిబ్ అల్ హసన్ (67; 75 బంతుల్లో 7x4, 1x6), ముష్ఫికర్ రహీమ్ (69; 64 బంతుల్లో 8x4)లు అర్ధ సెంచరీలు చేశారు. ఈ జోడి 142 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో బంగ్లాదేశ్ 37 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. ఈ ఇద్దరు భారీ షాట్లతో విరుచుకుపడడంతో బంగ్లా భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తోంది. బంగ్లా ఇన్నింగ్స్ను ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్కు 60 పరుగులు జోడించాక ఇక్బాల్ (16) ఔటయ్యాడు. అనంతరం మరో 15 జోడించాక వికెట్ కీపర్ డీకాక్ ఒక స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో సౌమ్య సర్కార్ 42( 30 బంతుల్లో 9 ఫోర్లు) పెవిలియన్ చేరాడు.
కష్టాల్లో ఉన్న జట్టును షకీబ్, రహీమ్లు అర్ధ సెంచరీలు చేసి ఆదుకున్నారు. ఈ ఇద్దరు బౌండరీలు బాదడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే 75 పరుగుల వద్ద షకిబ్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రహీమ్ (71), మిథున్ (5) ఉన్నారు. బంగ్లా 37 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. బంగ్లా భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది.