న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెమీఫైనల్, ఫైనల్లో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు' గెలిచిన ఆ ముగ్గురు ఎవరు?

ICC Cricket World Cup 2019: 3 players who have won the man of the match awards in both semi-final and final of a world cup

హైదరాబాద్: మరో రెండు రోజుల్లో క్రికెట్ మహా సంగ్రామానికి తెరలేవనుంది. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ మహా సంగ్రామం కోసం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఇంగ్లాండ్‌కు చేరుకున్నారు. వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 14న జరిగే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మెగా టోర్నీలో పలువురు ఆటగాళ్ల ప్రదర్శన వారి కెరీర్‌నే మలుపు తిప్పింది.

కాగా, వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో సెమీపైనల్‌తో పాటు ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని గెలుచుకున్న ఆటగాళ్లు ఉన్నారు. అలాంటి వారెవరో ఒక్కసారి చూద్దాం...

మొహిందర్ అమర్నాధ్ - ఇండియా(1983)

మొహిందర్ అమర్నాధ్ - ఇండియా(1983)

టీమిండియా తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన ఏడాది. లార్డ్స్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటికే రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచిన వెస్టిండిస్‌పై కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయం భారత క్రికెట్‌ను ఓ మలుపు తిప్పింది. ఈ టోర్నీలో భాగంగా టీమిండియా ఆడిన సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో మొహిందర్ అమర్నాధ్ ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాలి.

సెమీపైనల్లో కపిల్ సేన ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌తో తలపడింది. అందరూ ఇంగ్లాండే విజయం సాధిస్తుందని భావించారు. అయితే, మొహిందర్ అమర్నాధ్ తన అద్భుతమైన స్పెల్‌(2/27)తో ఇంగ్లాండ్‌ను చావు దెబ్బ తీశాడు. అనంతరం 214 పరుగుల లక్ష్య చేధనలో అమర్నాధ్(46) పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు.

ఇక, లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో రెండు సార్లు విశ్వ విజేతగా నిలిచిన వెస్టిండిస్‌తో భారత్ తలపడింది. మ్యాచ్ అరంభంలోనే సునీల్ గవాస్కర్ వికెట్‌ను కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియా మరో ఓపెనర్ శ్రీకాంత్‌తో కలిసి అమర్నాధ్ ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అమర్నాధ్(26) పరుగులు చేసి జట్టు స్కోరు 90 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిగతా బ్యాట్స్‌మన్ తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరడంతో టీమిండియా 183 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత చేధనలో అమర్నాధ్ మూడు వికెట్లు తీసి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు.

అరవింద డిసిల్వా - శ్రీలంక(1996)

అరవింద డిసిల్వా - శ్రీలంక(1996)

1996 వన్డే వరల్డ్‌కప్‌కు ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా శ్రీలంకను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన డిసిల్వా(47 బంతుల్లో 66) పరుగులు చేసిన ఆదుకున్నాడు. ఆ తర్వాత చేధనలో టీమిండియా 120/8 స్థితిలో ఉన్న సమయంలో భారత అభిమానులు స్టాండ్స్‌కు నిప్పంటించి ఆటను అడ్డుకోవడంతో శ్రీలంకను విజేతగా ప్రకటించారు. దీంతో ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని అందుకున్నాడు.

ఇక, ఆస్ట్రేలియాతో జరిగిన పైనల్లో తొలుత మూడు వికెట్లు తీసిన అరవింద డిసిల్వా ఆ తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగాడు. 242 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక ఓపెనర్లను త్వరగా కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డిసిల్వా గురుసింగే(125), అర్జున రణతుంగ(93)తో కలిసి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 107 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆఖరి బంతి వరకు క్రీజులో ఉన్నాడు. దీంతో పైనల్లో కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని అందుకున్నాడు.

షేన్ వార్న్ - ఆస్ట్రేలియా (1999)

షేన్ వార్న్ - ఆస్ట్రేలియా (1999)

అరవింద డిసిల్వా తర్వాత ఆ తర్వాత ఎడిషన్‌లో ఆస్ట్రేలియాకు చెందిన లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ ఈ ఘనత సాధించాడు. బర్మింగ్ హామ్ వేదికగా సఫారీలతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో వార్న్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీలు తొలుత ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. దీంతో ఆస్ట్రేలియా 213 పరుగులకే కుప్పకూలింది. అనంతరం లక్ష్య చేధనలో 12 ఓవర్లకు దక్షిణాఫ్రికా వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. ఈ దశలో బంతిని అందుకున్న వార్న్ 29 పరుగులకే నాలుగు వికెట్లను తీసి ఆసీస్‌కు బ్రేక్ ఇచ్చాడు. అయితే, లాన్స్ క్లూసెనర్ దూకుడుగా ఆడటంతో దక్షిణాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు అవసరమయ్యాయి.

మొదటి రెండు బంతులను రెండు ఫోర్లుగా మలచిన క్లూసెనర్ ఆ తర్వాతి బంతికి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అలెన్ డొనాల్డ్‌ను వార్న్ పెవిలియన్‌కు చేర్చడంతో మ్యాచ్ టైగా ముగిసిన ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. దీంతో ఈ మ్యాచ్‌లో షేన్ వార్న్‌కు మ్యాన్ ఆప్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక, పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో నాలుగు వికెట్లు తీసి ఆస్ట్రేలియా విజయంలో కీలకపాత్ర పోషించిన షేన్ వార్న్‌కు మ్యాన్ ఆప్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Story first published: Tuesday, May 28, 2019, 18:31 [IST]
Other articles published on May 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X