|
బౌన్సర్గా సంధించడంతో క్రీజులో ఉన్న కోహ్లీ
దీంతో స్టైకింగ్ ఎండ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక, ఆమిర్ వేసిన నాలుగో బంతిని బౌన్సర్గా సంధించడంతో క్రీజులో ఉన్న కోహ్లీ పుల్ చేయబోగా అది కీపర్ చేతుల్లో పడింది. దీనిపై ఔట్కు సర్ఫరాజ్ బలంగా అప్పీల్ చేయకపోయినా, అంపైర్ నిర్ణయం ప్రకటించకుండానే కోహ్లీ వెంటనే తలవంచుకొని పెవిలియన్ వైపు బయల్దేరాడు.
|
రీప్లే చూస్తే కోహ్లీ బ్యాట్ బంతిని తాకనే లేదు
అంపైర్ ఔట్గా కూడా ప్రకటించలేదు. రీప్లే చూస్తే కోహ్లీ బ్యాట్ బంతి తాకనే లేదని తేలింది. బ్యాట్ హ్యాండిల్ కాస్త వదులవడం వల్ల శబ్దం వచ్చి విరాట్ కోహ్లీ తాను ఔట్ అని భ్రమపడినట్లు తేలింది. పెవిలియన్కు చేరాక రీప్లే చూసుకుని విరాట్ కోహ్లీ అసహనం చెందడం మనకు కనిపించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి(77) ఐదో వికెట్గా ఔటయ్యాడు.
|
అంపైర్ నిర్ణయం ప్రకటించకుండానే
కీలక మ్యాచ్లో అంపైర్ నిర్ణయం ప్రకటించకుండానే కోహ్లీ మైదానాన్ని వీడటంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. పాక్ పేసర్ ఆమీర్ బౌన్సర్ల దెబ్బకు భయపడే ఔట్ కాకున్నా కోహ్లీ మైదానాన్ని వీడాడని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఈ మ్యాచ్లో మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
|
50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసిన భారత్
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. అనంతరం 337 పరుగుల లక్ష్య చేధనలో పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ను 40 ఓవర్లకు కుదించారు. దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్థాన్కు 40 ఓవర్లలో 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
|
40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు
అయితే, పాకిస్థాన్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసింది. ఈ విజయంతో భారత్ వరుసగా ఏడో సారి ప్రపంచకప్లో పాకిస్థాన్పై భారత్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన రోహిత్కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.