న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నెటిజన్ల జోకులు: ఆమీర్‌ బౌన్సర్లకు భయపడే కోహ్లీ ఔట్ కాకున్నా పెవిలియన్‌కు!

ICC Cricket World Cup 2019 : Kohli Trolled For Walking Without Edging Of Amir During IND V PAK
ICC Cricet World Cup 2019: Virat Kohli didnt wanted to face Amir anymore thats why he didnt took the DRS

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటైన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఔట్ కాకున్నా పెవిలియన్‌కు వెళ్లడంపై సగటు క్రీడాభిమానిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే, పాక్ పేసర్ ఆమీర్ బౌన్సర్లకు భయపడే కోహ్లీ అలా చేశాడంటూ సోషల్ మీడియాలో పాక్ అభిమానులు జోకులు పేల్చుతున్నారు.

అసలేం జరిగింది?
టీమిండియా 46.4 ఓవర్లకు గాను 305/4 ఉన్న స్థితిలో వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో అంఫైర్లు మ్యాచ్‌ని నిలిపివేశారు. వర్షం వెలిసిన తర్వాత విరాట్‌ కోహ్లీ, విజయ్‌ శంకర్‌ తిరిగి క్రీజులోకి వచ్చారు. ఇన్నింగ్స్ 48 ఓవర్‌ను పాక్ పేసర్ మహ్మద్‌ ఆమీర్‌ అందుకున్నాడు. తొలి బంతికి విజయ్‌ శంకర్‌ పరుగులేమీ తీయకపోగా, రెండో బంతికి సింగిల్‌ తీశాడు.

బౌన్సర్‌గా సంధించడంతో క్రీజులో ఉన్న కోహ్లీ

దీంతో స్టైకింగ్‌ ఎండ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక, ఆమిర్‌ వేసిన నాలుగో బంతిని బౌన్సర్‌గా సంధించడంతో క్రీజులో ఉన్న కోహ్లీ పుల్‌ చేయబోగా అది కీపర్‌ చేతుల్లో పడింది. దీనిపై ఔట్‌కు సర్ఫరాజ్‌ బలంగా అప్పీల్‌ చేయకపోయినా, అంపైర్‌ నిర్ణయం ప్రకటించకుండానే కోహ్లీ వెంటనే తలవంచుకొని పెవిలియన్‌ వైపు బయల్దేరాడు.

రీప్లే చూస్తే కోహ్లీ బ్యాట్‌ బంతిని తాకనే లేదు

అంపైర్‌ ఔట్‌గా కూడా ప్రకటించలేదు. రీప్లే చూస్తే కోహ్లీ బ్యాట్‌ బంతి తాకనే లేదని తేలింది. బ్యాట్‌ హ్యాండిల్‌ కాస్త వదులవడం వల్ల శబ్దం వచ్చి విరాట్ కోహ్లీ తాను ఔట్‌ అని భ్రమపడినట్లు తేలింది. పెవిలియన్‌కు చేరాక రీప్లే చూసుకుని విరాట్‌ కోహ్లీ అసహనం చెందడం మనకు కనిపించింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి(77) ఐదో వికెట్‌గా ఔటయ్యాడు.

అంపైర్‌ నిర్ణయం ప్రకటించకుండానే

కీలక మ్యాచ్‌లో అంపైర్‌ నిర్ణయం ప్రకటించకుండానే కోహ్లీ మైదానాన్ని వీడటంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. పాక్ పేసర్ ఆమీర్ బౌన్సర్ల దెబ్బకు భయపడే ఔట్ కాకున్నా కోహ్లీ మైదానాన్ని వీడాడని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసిన భారత్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. అనంతరం 337 పరుగుల లక్ష్య చేధనలో పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు కుదించారు. దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్థాన్‌కు 40 ఓవర్లలో 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు

అయితే, పాకిస్థాన్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసింది. ఈ విజయంతో భారత్ వరుసగా ఏడో సారి ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన రోహిత్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

Story first published: Monday, June 17, 2019, 14:15 [IST]
Other articles published on Jun 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X