కోపాన్ని ఎవరిపై చూపించాలో తెలియక
దీంతో వారి కోపం ఎవరిపై చూపించాలో తెలియక టీవీలను బద్దలు కొడుతుంటారు. తాజాగా ప్రపంచకప్లో భాగంగా ఆదివారం పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. గత 27 ఏళ్లుగా ప్రపంచకప్లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించారు.
టీమిండియాదే పైచేయి
మ్యాచ్కు ముందు ఎన్ని అంచనాలు ఉన్నా బరిలోకి దిగిన తర్వాత టీమిండియాదే పైచేయి అవుతుంది. ముఖ్యంగా ఆదివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్ అంతా ఏకపక్షంగా సాగింది. రెండేళ్ల క్రితం ఇదే ఇంగ్లీషు గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ విజయాన్ని చూసి మురిసిపోతూ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని ఆశించిన పాక్కు గర్వభంగం అయింది.
భారత ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతం
ముఖ్యంగా ఆదివారం నాటి మ్యాచ్లో భారత ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతం. ఈ మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక, కెప్టెన్ కోహ్లీ, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్లు అతడికి పూర్తి మద్దతునిచ్చారు. దీంతో పాకిస్థాన్పై టీమిండియా అలవోక విజయాన్ని నమోదు చేసింది.
ఘోర ఓటమిని తట్టుకోలేని
టీమిండియా చేతిలో ఘోర ఓటమిని తట్టుకోలేని పాక్ అభిమానులు టీవీలను పగలుకొట్టినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇవి పాత వీడియోలని తెలుస్తోంది. గతంలో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలైనప్పుడు ఆ దేశపు క్రికెట్ అభిమానులు టెలివిజన్లు పగులు కొట్టిన సందర్భాలు కోకోల్లలు.
పాక్ ఓడిపోవడంతో
తాజాగా ఆదివారం జరిగిన మ్యాచ్లో పాక్ ఓడిపోవడంతో అప్పటి వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆదివారం మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఓ ఆసక్తికరమైన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. పాకిస్థాన్లో టీవీలకు ప్రొటెక్షన్ ఇలా అంటూ ఓ మీమ్ను పోస్టు చేశారు.
టీవీ రిపేర్ చేసే మెకానిక్లకు పండుగే
పాకిస్థాన్ ఓడిపోతే ఆ దేశంలో టీవీ రిపేర్ చేసే మెకానిక్లకు పండుగే అంటూ మరోక నెటిజన్ ఇంకో మీమ్ను పోస్టు చేశారు. బాలీవుడ్ చిత్రం హెరా పెరీ చిత్రంలో అక్షయ్ కుమార్, పరేశ్ రావెల్, సునీల్ శెట్టి ఫొటోను పెట్టి.. టీవీ రిపేర్లకు డబ్బులే డబ్బులు అంటూ కామెంట్ పెట్టాడు.