
ఐసీసీ సీఈవో రిచర్డ్సన్ ఇలా
ఈ టోర్నమెంట్లో జరిగే 15 మ్యాచ్లకు కొత్త తరాన్ని క్రికెట్ వైపు ఆకర్షించేలా కృషి చేస్తారని ఐసీసీ సీఈవో రిచర్డ్సన్ పేర్కొన్నాడు. ఈ దిగ్గజాలతో కొన్ని స్కూళ్లు సందర్శించి పిల్లలకు క్రికెట్ మెళుకువలు నేర్పుతామని రిచర్డ్సన్ పేర్కొన్నాడు. 2002లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫిలో భారత్ జట్టులో సభ్యుడైన హర్భజన్ తన ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశాడు.

అంబాసిడర్గా ఎంపికవ్వడం గర్వంగా ఉంది
డిఫెండింగ్ చాంపియన్గా టీమిండియా బరిలోకి దిగుతున్న ఈ గ్లోబల్ ఈవెంట్కు అంబాసిడర్గా ఎంపికవ్వడం గర్వంగా ఉందని అన్నాడు. టోర్నమెంట్ను ప్రమోట్ చేయడంలో తన వంతు భాద్యతను నిర్వర్తిస్తానని హర్భజన్ తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీని కచ్చితంగా టీమిండియా గెలుస్తుందని హర్భజన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

టీమిండియా అత్యుత్తమంగా ఆడాల్సి ఉంది
ఈ టోర్నీలో భారత్ తన అత్యుత్తమ ఆటను ఆడితే చాలని, అయితే ఈ టోర్నీలో ప్రపంచంలోని టాప్-8 జట్టు పోటీపడతాయని మరిచిపోకూడదని హర్భజన్ అన్నాడు. ప్రతి జట్టు తనకు మెరుగైన అవకాశముందనే అనుకుంటుందిని అన్నాడు. మ్యాచ్ రోజు ఎవరు బాగా ఆడతారన్నది ముఖ్యమని భజ్జీ చెప్పుకొచ్చాడు.

టైటిల్ను నిలబెట్టుకునే సత్తా భారత్కు ఉంది
ఈ టోర్నీలో గెలిచే జట్టుగా ఏదైనా ఒక పేరే చెప్పమంటే మాత్రం సంతోషంగా భారత్ అంటానని అన్నాడు. ఈ జట్టుకు 2013లో గెలిచిన టైటిల్ను నిలబెట్టుకునే సత్తా ఉందని బలంగా నమ్ముతున్నా, టోర్నీకి ఆతిథ్యమివ్వనున్న ఇంగ్లాండ్ పరిస్థితులకు భారత్ ఎంత త్వరగా అలవాటు పడుతుందన్నది ఇక్కడ కీలకమని హర్భజన్ సింగ్ అన్నాడు.


Click it and Unblock the Notifications