హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలిని అనుకరించడం ఓ పిచ్చి పని అని కేఎల్ రాహుల్ అన్నాడు. చేతివేలి గాయంతో శిఖర్ ధావన్ ప్రపంచకప్నకు దూరం కావడంతో అతడి స్థానంలో రోహిత్ శర్మతో ఓపెనర్గా కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
రోహిత్ శర్మతో కలిసి శుభారంభాలను ఇస్తున్నప్పటికీ కేఎల్ రాహుల్ వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ మాట్లాడుతూ "రోహిత్ శర్మ బ్యాటింగ్ను అనుసరించడం పిచ్చి పని. అతడి ఓ ప్రత్యేక శైలి. దూకుడుగా ఆడేటప్పుడు రోహిత్ ప్రత్యేక గ్రహం నుంచి వచ్చిన క్రికెటర్లా ఆడతాడు" అని అన్నాడు.
"ఈ ప్రపంచకప్లో బాగానే ఆడుతున్నా. అయితే, నా ప్రదర్శన పట్ల వ్యక్తిగతంగా సంతృప్తిగా లేను. శుభారంభాలు చేసినా భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నా. భారీ స్కోర్లు చేయడం ఏ ఆటగాడికైనా గొప్పగా ఉంటుంది. రాబోయే మ్యాచ్ల్లో ఇదే ప్రదర్శనను కొనసాగించాలని అనుకుంటున్నా" అని కేఎల్ రాహుల్ అన్నాడు.
"మరింత మెరుగ్గా రాణించాలని ఆశిస్తున్నా. 60-70లు ఎలా చేస్తున్నానో భారీ స్కోరూ అలాగే చేయాలని అనుకుంటున్నా. సుదీర్ఘంగా ఆడితే కచ్చితంగా భారీ స్కోరు చేస్తాను. దాంతో జట్టుకు ప్రయోజనం కలుగుతుంది. దీనిపై జట్టు సభ్యులను ఇప్పటికే సంప్రదించా. ఏది ఏమైనా ఉపాయాన్ని నేనే కనుక్కోవాలి" అని రాహుల్ పేర్కొన్నాడు.
టోర్నీలో భాగంగా టీమిండియా తన తదుపరి మ్యాచ్లో జులై 6న శ్రీలంకతో తలపడనుంది. ఇప్పటికే టీమిండియా సెమీస్కు చేరిన సంగతి తెలిసిందే.