చర్చించిన తర్వాతే ఆరు పరగులు:
నిజానికి ఆ బంతికి 5 పరుగులే ఇవ్వాలి. అయితే బౌండరీతో కలిపి మొత్తంగా ఆరు పరుగులు ఇచ్చారు. దాంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్ కూడా టై కావడంతో అధిక బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్ను చాంపియన్గా ప్రకటించారు. మ్యాచ్ అధికారులతో పాటు ఫీల్డ్లోనే ఉన్న మరొక అంపైర్ ఎరాస్మస్తో చర్చించిన తర్వాతే ఆరు పరగులు ఇచ్చానంటూ అంపైర్ కుమార్ ధర్మసేన తెలిపాడు. ఇది తాను చేసిన అతి పెద్ద తప్పిదమని టీవీ రిప్లేలో చూసిన తర్వాత కానీ అర్థం కాలేదన్నాడు.
ఎప్పటికీ చింతించను:
'ఓవర్త్రోకు ఆరు పరుగులు ఇవ్వడం నా నిర్ణయ లోపమే. అది ఇప్పుడు టీవీ రీప్లేలు చూస్తే తెలుస్తోంది. టీవీ రీప్లేలు చూసిన తర్వాత ప్రజలు నిందించడం చాలా సులభం. కానీ ఆ సమయంలో మైదానంలో ఉన్నపుడు అదే సరైన నిర్ణయం అనిపించింది. నిర్ణీత సమయంలో తీసుకున్న నా నిర్ణయాన్ని ఐసీసీ ప్రశంసించింది కూడా. ఆ నిర్ణయంపై ఎప్పటికీ చింతించను' అని ధర్మసేన తెలిపారు.
సూపర్ ఓవర్లో విజయం:
ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ కూడా 50 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌటైంది. స్టోక్స్ (84నాటౌట్; 98బంతుల్లో 5×4, 2×6) అద్భుత పోరాటం చేయడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్కు దారితీసింది. సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 6 బంతుల్లో 15 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన న్యూజిలాండ్ కూడా 6 బంతుల్లో 15 పరుగులు చేసింది. సూపర్ ఓవర్ కూడా టైగా ముగియడంతో.. మ్యాచ్లో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లండ్ విజేతగా నిలిచింది.