హైదరాబాద్: ప్రపంచకప్లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు ఆటతీరు గురించి చెప్పడానికి తన దగ్గర ఎలాంటి వివరణ లేదని టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్కి సౌరవ్ గంగూలీ కామంటెటేర్గా వ్యవహారించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో కామెంట్రీ బాక్స్లో ఉన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్, టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
ధోని-జాదవ్ల బ్యాటింగ్ తీరుపై నాసిర్ హుస్సేన్ అసహనం వ్యక్తం చేశాడు. తాను పూర్తిగా తికమకకు గురయ్యానని, ఏం జరుగుతుందో తెలియడం లేదని చెప్పుకొచ్చాడు. ఈ తరహా బ్యాటింగ్ టీమిండియాకు అవసరం లేదని అన్నాడు. కొంతమంది ఫ్యాన్స్ ఇప్పటికే వెళ్లిపోతున్నారని, ధోనీ నుంచి వాళ్లు ఈ ఆటతీరును ఆశించలేదని, ధోనీ మార్క్ షాట్స్ ఆశించారని అన్నాడు.
అనంతరం గంగూలీ మాట్లాడుతూ ఈ ఆటతీరు గురించి చెప్పడానికి తన దగ్గర ఎలాంటి వివరణ లేదని అన్నాడు. ఆ ప్రశ్న అడిగినప్పటికీ ఈ సింగిల్స్ గురించి తన దగ్గర సమాధానం లేదని చెప్పాడు. ఐదు వికెట్లు చేతిలో ఉండగా 338 పరుగులు చేయలేని స్థితిలో భారత బ్యాట్స్మెన్స్ ఉన్నారని గంగూలీ మండిపడ్డాడు.
ధోని సింగిల్స్ తీస్తూ స్లోగా బ్యాటింగ్ చేయడంపై సౌరవ్ గంగూలీ మండిపడ్డాడు. టీమిండియా 300 పరుగులకు ఆలౌట్ అయినా తాను బాధపడేవాడిని కాదని, ఐదు వికెట్లు చేతిలో ఉండగా కూడా ఇలా ఆడటం ఏంటని గంగూలీ ఈ సందర్భంగా ప్రశ్నించాడు.
#INDvENG
— StarAjith (@starajith_Thala) July 1, 2019
Listen commentary.#fixed #INDvENG #PAKvBAN pic.twitter.com/OBMEcirzNk
{headtohead_cricket_2_3}