గతంలో భారత జట్టు ఎలా ఆడిందో అవసరం లేదు
‘ఇంగ్లాండ్తో టెస్టులు ఆడేందుకు భారత్ జట్టు ఎంపికకు చాలా అవకాశాలు ఉన్నాయి. గతంలో భారత జట్టు ఇంగ్లిష్ గడ్డపై ఎలా ఆడింది, ఎన్ని విజయాలు సాధించగలిగిందో.. ఇప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్లో పర్యటిస్తోన్న భారత జట్టు తప్పకుండా సిరీస్ గెలుస్తోందన్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే జట్టులోని ఆటగాళ్లు ప్రత్యర్థులకు ధీటుగా సమాధానం చెప్పగలరు'.

గెలవకపోతే అప్పుడు ఆశ్చర్యపోతా..!
'టెస్టు సిరీస్ గెలవకపోతే అప్పుడు ఆశ్చర్యపోతా. 2014లో ఇంగ్లాండ్ పర్యటన ద్వారా కోహ్లీకి నేర్చుకునే అవకాశం దక్కిందనే చెప్పుకోవాలి. అతనో టెక్నికల్ ఆటగాడు. ఎలాంటి పరిస్థితులకైనా సులువుగా అలవాటు పడిపోతాడు. ఆస్ట్రేలియాలో నేను అతడి నుంచి అది బాగా గమనించాను. కేఎల్ రాహుల్ ఆడుతుంటే చూడటం చాలా ఇష్టం. ఫాస్ట్ బౌలర్లను చాలా తెలివిగా, సులువుగా ఎదుర్కొంటాడు.'

బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తాడు
'అన్ని రకాల షాట్లను ఆడేందుకు ప్రయత్నిస్తాడు. బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తాడు. ఇక ఓపెనర్ల విషయానికొస్తే ధావన్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఉండటం టీమిండియాకు మంచి బలం. కానీ, వారిలో ఎవరిని ఎంచుకుంటరానేది కెప్టెన్పై ఆధారపడి ఉంటుంది. ఇక అశ్విన్ ఓ గొప్ప బౌలర్. ఒక్కోసారి తన బ్యాట్తో కూడా సత్తా చాటగలడు. టెస్టు సిరీస్లో కుల్దీప్ రాణిస్తాడని అంత బలంగా చెప్పలేను.'

ఎడ్జ్బాస్టన్లో తొలి టెస్టు.. ఇంగ్లాండ్కు 1000వది:
'బౌలింగ్ విభాగంలో ఇరువైపులా సమాన ప్రత్యర్థులున్నప్పటికీ బ్యాటింగ్ విభాగం టీమిండియాదే బలంగా ఉందనుకుంటాను' అని వాట్సన్ చెప్పాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఈ రోజు ప్రారంభంకానుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. ఈ టెస్టు ఇంగ్లాండ్కు 1000వది కావడం విశేషం.


Click it and Unblock the Notifications












