హైదరాబాద్: స్వదేశంలో జరిగిన వన్డేల్లో, టెస్టుల్లో భారత క్రికెట్ జట్టు దూసుకుపోతుంది. ఇదే పంథాను దక్షిణాఫ్రికా పర్యటనలోనూ కొనసాగిస్తుందని జట్టులోని మిడిలార్డర్ బ్యాట్స్మెన్/ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ధీమా వ్యక్తం చేశాడు. జనవరి 5 నుంచి సఫారీలతో భారత్ జట్టు మూడు టెస్టుల సిరీస్ని ఆడనుంది.
ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా గడ్డపై కోహ్లిసేన విజయావకాశాల గురించి మీడియాతో సాహా మంగళవారం ముచ్చటించారు. భారత్ జట్టు మూడేళ్లుగా అద్వితీయ ఆటతో వరుస సిరీస్ విజయాలు సాధిస్తుందన్నాడు. ఇంతే పట్టుదలతో ఆటతీరుని దక్షిణాఫ్రికా గడ్డపై కూడా కొనసాగిస్తే కచ్చితంగా భారత్ అద్భుతాలు సృష్టించగలదని పేర్కొన్నాడు.
టెస్టు సిరీస్లోనూ భారత్ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించాడు. దక్షిణాఫ్రికా పర్యటన గురించి జట్టులో ఇంతవరకు చిన్న చర్చ కూడా జరగలేదని సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఇటీవల ఫీల్డింగ్లో జరుగుతున్న పొరబాట్లను గురించి స్పందిస్తూ.. క్యాచ్లు చేజారడం మ్యాచ్ల్లో మామూలే. బెస్ట్ ఫీల్డర్లుగా పేరొందిన క్రికెటర్లు కూడా కొన్ని క్యాచ్లని జారవిడిచిన దాఖలాలు ఎన్నో ఉన్నాయంటూ బదులిచ్చాడు.
కాగా, భారత వన్డే జట్టుకు దూరంగా ఉన్న సాహా ప్రస్తుతం దేశవాళీ టోర్నీ, రంజీ ట్రోఫీలలో బెంగాల్ తరఫున మ్యాచ్లు ఆడుతూ మునుపటి ఫామ్ని అందుకునేందుకు ప్రయత్నంలో ఉన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.