కోల్కతా: తాను భద్రత లేకుండా భారత్కు చాలాసార్లు వచ్చానని టెన్నిస్ తార సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ చెప్పాడు. భారత్లో తమ జట్టుకు కల్పించే భద్రత పైన పాకిస్తాన్ అధికారులు సందేహాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అనంతరం పాక్ క్రికెట్ జట్టు శనివారం రాత్రి కోల్కతాలో అడుగు పెట్టింది.
ఈ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రీదితో కలిసి ఆదివారం ఈడెన్ గార్డెన్లో షోయబ్ మాలిక్ మాట్లాడాడు. భద్రత విషయంలో చాలా చర్చ జరిగిందని, నిజానికి భారత్లో పాకిస్తాన్ జట్టుకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలన్నాడు. అయితే, ఎలాంటి భద్రత లేకుండా తాను చాలాసార్లు భారత్ వచ్చానని చెప్పాడు.
భారత్ రావడం తనకు ఆనందాన్ని ఇశ్తోందని, ఇక్కడ తాను ఎప్పుడూ ఎంతో అభిమానం పొందానని చెప్పాడు. భారత్కు రావడాన్ని తాను గర్వంగా భావిస్తానని చెప్పాడు. తన భార్య సానియా మీర్జా (హైదరాబాద్) భారత్కు చెందిన మహిళ అని, ఈ నేపథ్యంలో తాను చాలాసార్లు సెక్యూరిటీ లేకుండా వచ్చానని చెప్పాడు.
షాహిత్ అఫ్రీది ఆసక్తికర వ్యాఖ్య
తమకు పాకిస్తాన్లో కంటే భారత్లో ఎక్కువ అభిమానం లభిస్తోందని పాక్ కెప్టెన్ షాహిత్ అఫ్రీది చెప్పాడు. భారత్ బాగా ఆడుతోందని కితాబిచ్చాడు. ఆసియా కప్లో విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ బాగా ఆడారని చెప్పాడు. భారత్కు రావడాన్ని తాను ఎంజాయ్ చేస్తానని చెప్పాడు.
అంతర్జాతీయ టాప్ పేసర్లలో మహమ్మద్ అమీర్ ఒకడని, అతను ఉత్తమ బౌలర్ అని షాహిద్ అఫ్రిదీ అన్నాడు. టీమిండియా బ్యాటింగ్, పాకిస్థాన్ బౌలింగ్ మధ్య ప్రధాన పోరు ఉండనుందన్నాడు. తమ బౌలింగ్ పటిష్టంగా ఉందనిచెప్పాడు.
భారత్ పైన తమ బ్యాట్స్మెన్ మంచి స్కోరు సాధిస్తే దానిని కాపాడుకునే సామర్థ్యం తమ బౌలర్లకు ఉందన్నాడు. అఫ్రిది ధీమా వ్యక్తం చేశాడు. పాక్ బౌలర్ మహ్మద్ అమీర్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదంటూ భారత్ బ్యాట్సుమెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యల పైనా అఫ్రిది స్పందించాడు. ఆ వ్యాఖ్యల గురించి రోహిత్ శర్మనే అడగాలన్నాడు.