
సెలక్టర్ల అనుమతితో క్రికెట్ ఆడటం ప్రారంభించలేదు
'నేను సెలక్టర్ల అనుమతితో క్రికెట్ ఆడటం ప్రారంభించలేదు. అటువంటప్పుడు సెలక్టర్ల అనుమతితో వీడ్కోలు ఎందుకు చెబుతాను. మరి ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అలా వ్యాఖ్యానించినట్లు నాకు తెలియదు. ఆ విషయాన్ని నాకైతే ఎమ్మెస్కే చెప్పలేదు. మీరు మాత్రమే నన్ను ఆ ప్రశ్న అడుగుతున్నారు' అని నెహ్రా అన్నాడు.

జట్టు మేనేజ్ మెంట్తో మాత్రమే చర్చించాను
'నా వీడ్కోలుపై నేను కేవలం జట్టు మేనేజ్ మెంట్తో మాత్రమే చర్చించాను. ఇటీవల ముగిసిన ఆసీస్తో సిరీస్లో భాగంగా నేను రాంచీకి వచ్చినప్పుడు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి నా ప్లాన్ చెప్పా. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలకాలని అనుకుంటున్నట్లు కోహ్లీతో స్పష్టం చేశా. దీనికి కోహ్లీ ఆశ్చర్యపోయాడు' అని నెహ్రా తెలిపాడు.

ఐపీఎల్లో ఆటగాడిగా కోచ్గా ఉంటూ కెరీర్ను కొనసాగించవచ్చు కదా
'కోచ్గా ప్లేయర్గా ఐపీఎల్లో ఆడే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు క్రికెట్ నుంచి మొత్తంగా గుడ్ బై చెప్పడమని కోహ్లీ నన్ను అడిగాడు. ఐపీఎల్లో ఆటగాడిగా కోచ్గా ఉంటూ కెరీర్ను కొనసాగించవచ్చు కదా అన్నాడు. నేను మొత్తంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు కోహ్లీకి తెలిపా. ఇది మాత్రమే జరిగింది' అని నెహ్రా స్పష్టం చేశాడు.

నా వీడ్కోలు గురించి ఎన్నిసార్లు అడిగినా ఇదే చెబుతా
'నా వీడ్కోలు గురించి ఎన్నిసార్లు అడిగినా ఇదే చెబుతా. అది కివీస్తో సిరీస్కు ఢిల్లీ మ్యాచ్ ద్వారా కుదిరింది. అంతేకానీ నాకు వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేయమని ఎవర్నీ అడగలేదు. నేను సెలక్టర్ల అనుమతితో ఫేర్వెల్ మ్యాచ్ను ఏర్పాటు చేయించుకోలేదు. నేను తీసుకునే నిర్ణయంలో కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, జట్టు మేనేజ్ మెంట్ పాత్ర మాత్రమే ఉంది. సెలక్టర్ల పాత్ర ఇక్కడ ఎంతమాత్రం లేదు' అని నెహ్రా పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications