న్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్ సిరీస్ గురించి చెప్పేందుకు తాను జ్యోతిష్కుడిని కాదని బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ మంగళవారం నాడు అన్నాడు. ఇండో - పాక్ సిరీస్ గురించి విలేకరులు ప్రశ్నించగా ఆయన ఆచితూచి స్పందించాడు.
సిరీస్ విషయమై సంప్రదింపులు, చర్చలు ఎక్కడికి వచ్చాయని ప్రశ్నించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ... ఇండో - పాక్ సిరీస్ ఎక్కడ ఆడాలో నిర్ణయించాల్సింది పాకిస్తాన్ అని చెప్పాడు. సిరీస్కు చెందిన బ్రాడ్ కాస్టింగ్ తదితర అంశాల గురించి పాక్ చెప్పాలన్నాడు. ఇది వాళ్లు నిర్వహించే సిరీస్ అని చెప్పాడు.
ప్రభుత్వం ఇండో - పాక్ సిరీస్కు పచ్చజెండా ఊపే అవకాశాలున్నాయా అని ప్రశ్నించగా... మనోహర్ తనదైన శైలిలో స్పందించారు. అతను నవ్వుతూ... నేను జ్యోతిష్కుడిని కాదని, కాబట్టి తాను భవిష్యత్తును చెప్పలేనని అన్నాడు.