ఐపీఎల్ సీజన్-12 ఫైనల్ మ్యాచ్కు హైదరాబాద్ ఆతిధ్యం ఇవ్వనుంది. మే 12న జరిగే ఫైనల్ మ్యాచ్ ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. మొదటి క్వాలిఫయర్ మ్యాచ్కు చెన్నై ఆతిధ్యం ఇవ్వనుంది. ఇక విశాఖలో ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఓ ప్రకటనలో తెలిపింది.
ఐపీఎల్ సీజన్-11 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలవడంతో.. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరగాలి. అయితే చెన్నై చిదంబరం స్టేడియంలో గత కొన్ని సంవత్సరాలుగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ మధ్య స్టాండ్స్ వివాదం కొనసాగుతోంది. ఈ వివాదం కారణంగా చిదంబరం స్టేడియంలో ఏ మ్యాచ్ జరిగినా మూడు స్టాండ్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఇప్పటికి కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఫైనల్ వేదికను చెన్నై నుండి హైదరాబాద్కు మార్చారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్కి చేరితే మాత్రం సొంత గడ్డపై ఆడకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటే. అయితే చెన్నై జట్టు లీగ్ దశలో మొదటి రెండు స్థానాల్లో ఉంటే.. క్వాలిఫయర్-1 మ్యాచ్ చెన్నైలోనే ఆడనుంది. ఇది చెన్నై జట్టుకు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం చెన్నై పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది కాబట్టి క్వాలిఫయర్-1 మ్యాచ్ చెన్నైలోనే ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ టోర్నీని మూడేసి సార్లు సాధించాయి. ప్రస్తుతం కూడా చెన్నై ఆ దిశగా దూసుకెళుతోంది.