మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్
మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడంతో చివరి రెండు రోజులు టిక్కెట్టు కొనుక్కున్న క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, ఆ రెండు రోజుల(ఆక్టోబర్ 15, 16) కోసం ముందుగానే టికెట్లు తీసుకున్న ప్రేక్షకులకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వనుంది. ఈ మేరకు హెచ్సీఏ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
జింఖానా గ్రౌండ్స్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు
నవంబర్ 10న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జింఖానా గ్రౌండ్స్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి టిక్కెట్టు డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్లు హెచ్సీఏ తన ప్రకటనలో పేర్కొంది. నాలుగో, ఐదో రోజు మ్యాచ్ టికెట్లు కొన్న వారు ఒరిజినల్ టికెట్లతో పాటు బ్యాంక్ అకౌంట్ వివరాలతో కౌంటర్ వద్ద సంప్రదించాలని వెల్లడించింది.
ఆన్లైన్ ద్వారా కొన్న వారికి ఆన్లైన్ ద్వారానే చెల్లింపు
ఇక, ఆన్లైన్ ద్వారా కొన్న వారికి ఆన్లైన్ ద్వారానే చెల్లింపు చేయనున్నట్లు హెచ్సీఏ తెలిపింది. అయితే, మొత్తం మ్యాచ్ వీక్షించేందుకు సీజన్ టికెట్ తీసుకున్న వారికి ఎలాంటి వాపసు ఉండదని హెచ్సీఏ స్పష్టం చేసింది. కాగా, ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 311 పరుగులకు ఆలౌటైంది.
10 వికెట్ల తేడాతో విజయం సాధించిన కోహ్లీసేన
అనతరం భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 367 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో రెండో ఇన్నింగ్స్ ఆసక్తికరంగా ఉంటుందని అంతా భావించారు. కానీ, విండీస్ బ్యాట్స్మన్ పేలవ ప్రదర్శనతో రెండో ఇన్నింగ్స్లో 127 పరుగులకే ఆలౌటైంది. దీంతో 75 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో రెండు రోజులు మిగిలుండగానే విజయం సాధించింది.