హైదరాబాద్: భాగ్యనగరంలోని ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో భారత్ ప్రత్యర్థి జట్టు బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్ టీమిండియా నాలుగు వికెట్లు నష్టపోయి 159 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 299 పరుగులు కలుపుకుని బంగ్లాదేశ్కు 459 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందుంచింది.

రెండో ఇన్నింగ్స్లో ఛటేశ్వర పుజారా అర్థశతకం (54 నాటౌట్) సాధించగా, విరాట్ కోహ్లీ (38), అజింక్యా రహానే (28) ఫర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, షకిబుల్ హసన్ తలో 2 వికెట్లు తీశారు.