కోచ్ కావడానికి గొప్ప ప్లేయర్ అయి ఉండాల్సిన అవసరం లేదు
కోచ్ కావడానికి గొప్ప ప్లేయర్ అయి ఉండాల్సిన అవసరం లేదని అన్నాడు. ఇంగ్లాండ్ టీమ్తో ట్రెవర్ బేలిస్, దక్షిణాఫ్రికా జట్టుతో రసెల్ డోమింగో చేసిన అద్భుతాలే ఇందుకు నిదర్శనమని రాజ్ పుత్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. గొప్ప ప్లేయర్ అయినంత మాత్రాన కోచ్గా సక్సెస్ అవుతాడన్న గ్యారెంటీ ఏమీ లేదని అన్నాడు. టెక్నికల్ నాలెడ్జి, కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉంటే సరిపోతుందని అన్నాడు. ఇంగ్లాండ్ క్రికెట్ను బేలిస్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడో చూడండని అన్నాడు. దక్షిణాఫ్రికా జట్టుతో రసెల్ డోమింగో సాధించిన రికార్డులను పరిశీలించాలని బీసీసీఐకి చురకలంటించాడు.
గొప్ప ప్లేయర్ గొప్ప కోచ్ అవుతాడన్న గ్యారెంటీ లేదు
ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప ఆటగాడు గొప్ప కోచ్ అవుతాడని ఎవరూ చెప్పలేదని, బీసీసీఐ దీనిని గుర్తుంచుకుంటే మంచిదని పేర్కొన్నాడు. అంతేకాదు తాను కోచ్గా ఉన్న సమయంలో ఇండియన్ టీమ్ 2007లో టీ20 వరల్డ్కప్, ఆస్ట్రేలియాలో సీబీ సిరీస్, పాకిస్థాన్పై విజయాలు గుర్తుంచుకోవాలని చెప్పాడు. టీ20 వరల్డ్కప్ సమయంలో తనను చాలా మంది టీమ్ మేనేజర్ అనుకున్నారని, కానీ ఆ సమయంలో సునీల్ దేవ్ మేనేజర్ కాగా.. తాను కోచ్నని అతను తెలిపాడు.
కుంబ్లే కేవలం ఇండియాలోనే సక్సెస్ అయ్యాడు
రెండు రోజుల క్రితం ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేసిన కుంబ్లే కేవలం ఇండియాలో సక్సెస్ అయ్యాడేమో కానీ.. తన కోచింగ్లో టీమిండియా విదేశాల్లో కూడా రాణించిందని గుర్తుచేశాడు. కాగా, ప్రస్తుతం లాల్చంద్ రాజ్పుత్ ఆఫ్ఘనిస్థాన్ జాతీయ జట్టుకు కోచ్గా ఉన్నాడు. గతేడాది కాలంలో అద్భుతమైన ఫలితాలు సాధించిపెట్టాడు. గురువారం ఆప్ఘనిస్ధాన్, ఐర్లాండ్ దేశాలకు ఐసీసీ ఆ టెస్టు హోదా కల్పించిన సంగతి తెలిసిందే.
ఆప్ఘనిస్థాన్కు టెస్టు హోదా
లండన్లోని ది ఓవల్ స్టేడియంలో జరిగిన సమావేశంలో ఐసీసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు టెస్టు మ్యాచ్లు ఆడే దేశాలు పది ఉండగా, ఇప్పుడా సంఖ్య 12కు పెరిగింది. ఇటీవలే వెస్టిండీస్తో వన్డే సిరీస్ను అప్ఘనిస్థాన్ జట్టు 1-1తో డ్రా చేసుకుంది. 2011లో వన్డే హోదా పొందిన ఆ జట్టు 2015లో వన్డే ర్యాంకింగ్స్లో టాప్-10లో చోటు సంపాదించింది.