అందుకే బుమ్రాకు ఏడో ఓవర్ బౌలింగ్ ఇచ్చాం
'చివరి ఓవర్లో సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉంటే కివీస్ గెలుపు కష్టం అవుతుందని భావించాం. అందుకే బుమ్రాకు ఏడో ఓవర్ బౌలింగ్ ఇచ్చాం. పాండ్యా ఆఖరి ఓవర్ వేశాడు' అని కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. మరోవైపు పాండ్యా వేసిన చివరి ఓవర్ తనను టెన్షన్కు గురి చేసిందని కూడా కోహ్లీ చెప్పాడు.
చివరి ఓవర్లో న్యూజిలాండ్ విజయానికి 19 పరుగులు
ఈ మ్యాచ్లో చివరి ఓవర్లో న్యూజిలాండ్ విజయానికి 19 పరుగులు కావాలి. ఈ దశలో విరాట్ కోహ్లీ బంతిని పాండ్యాకు అప్పగించాడు. మొదటి బంతి స్లో బంతిగా పాండ్యా చివరి ఓవర్ను ప్రారంభించాడు. మొదటి బంతికి బై రూపంలో పరుగు కోసం ప్రయత్నించిన మిచెల్ శాంట్నర్ ఔట్ అవ్వడం అభిమానులు ఆనందంలో మునిగారు.
పాండ్యా చేతివేలికి గాయం
ఇక, రెండో బంతి తర్వాత మైదానంలో డ్రా చోటు చేసుకుంది. పాండ్యా విసిరిన ఈ బంతిని కివీస్ బ్యాట్స్మన్ కలిన్ డీ గ్రాండ్హామ్ స్ట్రయిట్ షాట్ బాదాడు. తనైవైపు దూసుకొచ్చిన బంతిని క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించిన పాండ్యా చేతివేలికి గాయమైంది. దీంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది.
చివరి ఓవర్ను విజయవంతంగా పూర్తి చేసిన పాండ్యా
వెంటనే జట్టు ఫిజియో నిపుణుడు ప్యాట్రిక్ ఫర్హర్ట్ మైదానంలోకి వచ్చి పాండ్యాకు ప్రాధమిక చికిత్స చేశాడు. దీంతో ఫిట్ అయిన పాండ్యా చివరి ఓవర్ను విజయవంతంగా పూర్తిచేశాడు. మూడో బంతిని గ్రాండ్హోమ్ భారీ సిక్సర్ కొట్టినప్పటికీ... ఆ తర్వాతి బంతులను పాండ్యా కట్టుదిట్టంగా వేయడంతో భారత్ విజయం సాధించింది.