
అయిదు పరుగుల తేడాతో..
వర్షం అంతరాయాన్ని కలిగించిన ఈ మ్యాచ్లో.. రోహిత్ సేన ఉంచిన లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా తడపడింది. వెంటవెంటనే ఆరు వికెట్లను కోల్పోయింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు అద్దిరిపోయే ఆరంభాన్ని అందించినప్పటికీ- దాన్ని కాపాడుకోలేకపోయారు మిగిలిన బ్యాటర్లు. టీమిండియా పేస్ బౌలింగ్ ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్ లిట్టన్ దాస్ మెరుపు ఇన్నింగ్ ఆడాడు. 27 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 60, మరో ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో 21 పరుగులు చేశారు.

సెమీస్కు ఇంచ్ దూరంలో..
డక్వర్త్ లూయిస్ విధానంలో బంగ్లాదేశ్- 16 ఓవర్లల్లో 150 పరుగులు చేయాల్సి ఉండగా.. 145 వద్దే నిలిచిపోయిందా జట్టు ప్రస్థానం. 16 ఓవర్లల్లో ఆరు వికెట్లను కోల్పోయి 145 పరుగులే చేయగలిగింది. అర్ష్దీప్ సింగ్ రెండు వికెట్లు కూల్చాడు. హార్దిక్ పాండ్యా, షమీ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో భారత్.. టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్స్కు మరింత చేరువైంది. ఇంచ్ దూరంలో నిలిచింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే- మొత్తం ఎనిమిది పాయింట్లతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది.

రికార్డ్ స్థాయి వ్యూవర్షిప్..
భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్.. రికార్డుస్థాయిలో వ్యూవర్షిప్ను సొంతం చేసుకుంది. కిందటి నెల 23వ తేదీన మెల్బోర్న్లో జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వ్యూవర్షిప్ను దాటేసింది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా లక్షలాది మంది ఈ మ్యాచ్ను తిలకించారు. 19 మంది మిలియన్ల మంది హాట్స్టార్ యాప్ ద్వారా అడిలైడ్ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఈ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేసింది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడం, తమిళ భాషల్లో లైవ్ టెలికాస్ట్ అయింది.

సెమీస్ చేర్చే మ్యాచ్ కావడం వల్లే..
నిజానికి ఈ మ్యాచ్ ప్రారంభ ఓవర్లల్లో భారత్ బౌలర్లు చేతులెత్తేశారు. బంగ్లాదేశ్ ఓపెనర్ లిట్టన్ దాస్ సునామీలా విరుచుకుపడ్డాడు. 27 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 60 పరుగులు చేశాడు. ఈ పరిణామం.. హాట్స్టార్ వ్యూవర్షిప్ను ఒక్కసారిగా పెంచింది. మ్యాచ్ ఉంటుందా? పోతుందా? అనే ఆందోళన అభిమానుల్లో వ్యక్తమైంది. లిట్టన్ దాస్ రనౌట్ తరువాత బౌలర్లు విజృంభించడం.. వెంటవెంటనే వికెట్లు తీయడంతో ఊపిరి పీల్చుకున్నారు.


Click it and Unblock the Notifications












