
భారత జట్టులో మంచి వాతావరణం
"సపోర్టింగ్ స్టాఫ్ పేసర్ల మధ్య సంభాషణ ఉండాలి. బౌలర్ ఎప్పుడైన మనసు విప్పి తన ఆలోచనలు, భయాలు, నమ్మకాల గురించి చెబుతారో అప్పుడే అతడిని సహాయక సిబ్బంది బాగా చూసుకోగలుగుతారు" అని భరత్ అరుణ్ తెలిపాడు. భారత జట్టులో మంచి వాతావరణాన్ని సృష్టించిన కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీకి ఈ సందర్భంగా భరత్ అరుణ్ థ్యాంక్స్ చెప్పారు.

నిజాయతీ చాలా ముఖ్యం
"ఇక్కడ, నిజాయతీ చాలా ముఖ్యం. సిడ్నీ టెస్టుకు ముందు ఇషాంత్ మా వద్దకొచ్చి ఆడలేనని చెప్పాడు. ఇబ్బందిగా ఉందని చెప్పాడు. అప్పుడు జట్టు ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, కుల్దీప్తో బరిలోకి దిగాలని నిర్ణయించాం. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత బుమ్రా న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేయాల్సి ఉంది. అయితే, అతడు అలిసిపోయానని చెప్పాడు. దీంతో అతడికి విరామం ఇచ్చాం" అని భరత్ అరుణ్ చెప్పాడు.

గతేడాది సఫారీ పర్యటనతోనే
"ఆటగాళ్లకు ఇలాంటి స్వేచ్ఛనిచ్చిన కోహ్లీ, రవి శాస్త్రికి అభినందనలు. బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేశాడు. అతడు ఇచ్చిన ప్రేరణతో మిగతా పేసర్లు రాణిస్తున్నారు. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనతోనే భారత పేసర్ల దాడి ఆరంభమైంది" అని భరత్ అరుణ్ వెల్లడించాడు.


Click it and Unblock the Notifications












